సూర్యాపేట జిల్లాకు చెందిన వైద్యాధికారి డాక్టర్ కోటాచలం కుటుంబం మొత్తం ఇప్పుడు వైరస్ బారిన పడింది. ఆర్టీ - పీసీఆర్, ర్యాపిడ్ రెండు టెస్టుల్లో కూడా కరోనా పాజిటివ్గా రుజువైంది. ఇందుకు ప్రధానంగా ఆయన కుమారుడే కారణమంటున్నారు వైద్యులు. వారం రోజుల క్రితం డాక్టర్ కోటాచలం కుమారుడు జర్మనీ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా... ఆయన కుటుంబ సభ్యులంతా కూడా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. రెండు రోజుల పాటు తిరుపతిలో పర్యటించిన అనంతరం రెండు రోజుల క్రితమే సూర్యాపేటకు తిరిగి చేరుకున్నారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో... కుటుంబం మొత్తం పరీక్షలు చేయించుకోగా... వైరస్ సోకినట్లు తేలింది. సరిగ్గా రెండు రోజుల క్రితమే డిసెంబర్ ఒకటవ తేదీన ఎయిడ్స్ డే సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూడా డాక్టర్ కోటాచలం పాల్గొన్నారు. దీంతో ఇప్పుడు వైద్య సిబ్బందిలో కూడా కలవరం మొదలైంది. కోటాచలం కుటుంబం మొత్తం ఇప్పుడు ఐసోలేషన్లో ఉన్నారు. ఆరుగురికి వైరస్ సోకినట్లు తేలడంతో.. తిరుపతి అధికారులు కూడా ఇప్పుడు అలర్ట్ అయ్యారు. కొత్తగా ఎవరికైనా వైరస్ లక్షణాలున్నాయా అని సర్వే చేపట్టారు.
సూర్యాపేట జిల్లాకు చెందిన వైద్యాధికారి డాక్టర్ కోటాచలం కుటుంబం మొత్తం ఇప్పుడు వైరస్ బారిన పడింది. ఆర్టీ - పీసీఆర్, ర్యాపిడ్ రెండు టెస్టుల్లో కూడా కరోనా పాజిటివ్గా రుజువైంది. ఇందుకు ప్రధానంగా ఆయన కుమారుడే కారణమంటున్నారు వైద్యులు. వారం రోజుల క్రితం డాక్టర్ కోటాచలం కుమారుడు జర్మనీ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా... ఆయన కుటుంబ సభ్యులంతా కూడా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. రెండు రోజుల పాటు తిరుపతిలో పర్యటించిన అనంతరం రెండు రోజుల క్రితమే సూర్యాపేటకు తిరిగి చేరుకున్నారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో... కుటుంబం మొత్తం పరీక్షలు చేయించుకోగా... వైరస్ సోకినట్లు తేలింది. సరిగ్గా రెండు రోజుల క్రితమే డిసెంబర్ ఒకటవ తేదీన ఎయిడ్స్ డే సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూడా డాక్టర్ కోటాచలం పాల్గొన్నారు. దీంతో ఇప్పుడు వైద్య సిబ్బందిలో కూడా కలవరం మొదలైంది. కోటాచలం కుటుంబం మొత్తం ఇప్పుడు ఐసోలేషన్లో ఉన్నారు. ఆరుగురికి వైరస్ సోకినట్లు తేలడంతో.. తిరుపతి అధికారులు కూడా ఇప్పుడు అలర్ట్ అయ్యారు. కొత్తగా ఎవరికైనా వైరస్ లక్షణాలున్నాయా అని సర్వే చేపట్టారు.