అంబానీ ఇంట ఎప్పుడు సందడి మొదలవుతుందా అని వేచి చూసిన వారి ఆశలకు ఎట్టకేలకు కళ్లెం పడింది. ఆసియాలో అతిపెద్ద సంపన్నుడు, ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ మరియు వజ్రాల కంపెనీ రోజీ బ్లూ డైమండ్స్ సంస్థ అధినేత రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాల నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
నిన్న శనివారం గోవాలో ఇరు కుటుంబాల యొక్క అత్యంత సన్నిహితుల మధ్య ఈ నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. కాగా వీరిద్దరూ ప్రేమికులు కావడం విశేషం. ఆకాశ్, శ్లోకాలు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ధీరూబాయ్ అంబానీ స్కూల్లో ఇద్దరూ కలిసే చదువుకున్నారు. వీరు చదువయ్యేలోపు ఒకరికి ఒకరు ప్రేమను వ్యక్తపరచుకున్నారని వార్తలు వస్తున్నాయి.
వీరి వ్యక్తిగత జీవితానికొస్తే ముకేశ్, నీతూ అంబానీల ప్రథమ సంతానమే ఆకాశ్. ఈయన ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని టెలికం వెంచర్ రిలయన్స్ జియో కంపెనీ బోర్డులో ఇప్పటికే డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రోజీ బ్లూ డైమండ్స్ అధినేత రసెల్ మెహతా, మోనా మెహతాల మూడవ మరియు చివరి సంతానమే శ్లోకా. ఈమె కూడా రోజీ బ్లూ ఫౌండేషన్కు డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వీరు ఎప్పుడు పెళ్లాడబోతారు అని అధికారిక ప్రకటన వెలువడలేదు కాని డిసెంబర్లో వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందింది.