వైఎస్ జగన్ తో ఈరోజు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ ప్రత్యేకంగా కలుస్తున్నారు.  ఈ మధ్యాహ్నం సమయంలో వైఎస్ జగన్ ఇంటివద్ద మెగాస్టార్దంపతులు, నిర్మాత రామ్ చరణ్ లు జగన్ ను కలుగుస్తున్నారు.  జగన్ అయన ఇంట్లో వీరికి ప్రత్యేక విందును ఏర్పాటు చేస్తున్నారు.  ఈ విందు కార్యక్రమంలో చిరు దంపతులు, రామ్ చరణ్ పాల్గొంటున్నారు.  అయితే, వీరితో పాటుగా గంట శ్రీనివాస్ కూడా వెళ్తారని వార్తలు వచ్చినా అందులో నిజం లేదని తేలిపోయింది.  


ఇక జగన్ ను కలిసి సైరా సినిమా గురించి మాట్లాడబోతున్నారు.  ఈ సినిమాను చూడమని కోరడమే కాకుండా, ఈ సినిమాకు వినోదపన్ను రాయితీ ఇవ్వాలని కూడా అడిగే అవకాశం ఉంది.  అంతేకాదు, సైరా సినిమాను ఆంధ్రప్రదేశ్ ఆరు షోలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో.. మంచి వసూళ్లు వచ్చాయి.  దీని వలన నిర్మాత రామ్ చరణ్ కు లబ్ది చేకూరింది కాబట్టి జగన్ ను కలిసి కృతజ్ఞతలు చెప్పబోతున్నారు.  


ఇక ఇదిలా ఉంటె, వీరు జగన్ ఇంటికి వెళ్లే ముందు దారిలో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పవన్ కళ్యాణ్ ను, అయన సతీమణిని కలవబోతున్నారు.  పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఇల్లు కట్టుకున్నాక మొదటిసారి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ ఇంటికి వెళ్తున్నారు.  ఇలా అన్నయ్య ఇంటికి వస్తుండటంతో అక్కడ హడావుడి మరో రకంగా ఉన్నది.  పవన్ కళ్యాణ్ ను కలిసి కాసేపు మాట్లాడిన తరువాత జగన్ ను కలుస్తారు.  


తాజా సమాచారం ప్రకారం జగన్ ను పవన్ కళ్యాణ్ మీట్ అయ్యారు.  జగన్ ఇంట్లో ఆయన్ను కలిసిన మెగాస్టార్... జగన్ ను ఘనంగా సత్కరించారు.  జగన్ కు పుష్పగుచ్ఛం శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు.  ముఖ్యమంత్రిగా ఎంపికైన తరువాత జగన్ చిరంజీవి మీట్ కావడం ఇదే మొదటిసారి.  అనంతరం ఇరుగు కలిసి భోజనం చేశారు.  సైరా సినిమా చూడాలని జగన్ ను మెగాస్టార్ చిరంజీవి కోరారు.  దానికి జగన్ కూడా సానూకూలంగా స్పందించినట్టు సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: