కానీ నెల రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ట్విస్టుతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు ఘటన కృష్ణాజిల్లా వెలుగులోకి వచ్చింది. చాట్రాయి కి చెందిన యువకుడికి నాలుగేళ్ల క్రితం నూజివీడు కు చెందిన యువతితో పెళ్లి జరిగింది. కన్సల్టెన్సీలు జాబ్ చేస్తూ ఉంటాడు యువకుడు. నాలుగేళ్లు అయినప్పటికీ పిల్లలు లేకపోవడంతో ఎంతోమంది డాక్టర్లను సంప్రదించారు. ఇక చివరికి భార్య కు పిల్లలు పుట్టే అవకాశం లేదని నిర్ణయించుకున్నాడు భర్త. ఈ క్రమం లోనే ఆలోచనలో పడిపోయిన భర్త కిరాతకుడిగా మారిపోయాడు. అంతవరకూ ఎంతో ప్రేమగా చూసుకున్న భార్యను దారుణంగా గొంతునులిమి చంపేశాడు
భార్య అనారోగ్యం బారిన పడి చనిపోయింది అంటూ అందరినీ నమ్మించాడు. ఇక దంపతులిద్దరి మధ్య ఇప్పటివరకు ఎప్పుడూ గొడవ జరగకపోవడంతో అటు బంధువులు కాని స్థానికులు కాని ఆ భర్త చెప్పిన మాట నమ్మేస్తారు. ఇక ఆ యువతి తల్లిదండ్రులు కూడాభర్త మాటలే నమ్మేశారు. ఇక ఈ విషయం ఎలాగోలా పోలీసుల వరకు వెళ్లడంతో భర్త మీద అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. ఇక అమ్మాయి బాడీ పోస్టుమార్టం నిర్వహించగా బయటపడిన నిజంతో అందరూ షాక్ అయ్యారు. సదరు యువతిని ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది దీంతో తర్వాత భర్త కూడా నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది.