భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఒకప్పటి కాలంలో కనిపించేది కానీ నేటి కాలంలో మాత్రం భార్యభర్తల మధ్య ప్రేమ అభిమానం ఆప్యాయతలు కాదు పగ ప్రతీకారాల ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్ర lమంలోనే ఏకంగా వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న కట్టుకున్న వారిని దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఆ భార్యభర్తలిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు..  పెళ్లయి నాలుగేళ్లు అయినప్పటికీ ఒక్కసారి కూడా వారి మధ్య గొడవ జరిగలేదు. కానీ అకస్మాత్తుగా ఎందుకో  భార్య మృతి చెందింది.  ఎవరికీ అనుమానం రాలేదు అనారోగ్యం బారిన పడి మృతి చెందింది అని అందరూ భావించారు.



 కానీ నెల రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ట్విస్టుతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు ఘటన కృష్ణాజిల్లా వెలుగులోకి వచ్చింది. చాట్రాయి కి చెందిన యువకుడికి నాలుగేళ్ల క్రితం నూజివీడు కు చెందిన యువతితో పెళ్లి జరిగింది. కన్సల్టెన్సీలు జాబ్ చేస్తూ ఉంటాడు యువకుడు.  నాలుగేళ్లు అయినప్పటికీ పిల్లలు లేకపోవడంతో ఎంతోమంది డాక్టర్లను సంప్రదించారు. ఇక చివరికి భార్య కు పిల్లలు పుట్టే అవకాశం లేదని నిర్ణయించుకున్నాడు భర్త. ఈ క్రమం లోనే ఆలోచనలో పడిపోయిన భర్త కిరాతకుడిగా మారిపోయాడు.  అంతవరకూ ఎంతో ప్రేమగా చూసుకున్న భార్యను దారుణంగా గొంతునులిమి చంపేశాడు




 భార్య అనారోగ్యం బారిన పడి చనిపోయింది అంటూ అందరినీ నమ్మించాడు. ఇక దంపతులిద్దరి మధ్య ఇప్పటివరకు ఎప్పుడూ గొడవ జరగకపోవడంతో అటు బంధువులు కాని స్థానికులు కాని ఆ భర్త చెప్పిన మాట నమ్మేస్తారు. ఇక ఆ యువతి తల్లిదండ్రులు కూడాభర్త మాటలే నమ్మేశారు.  ఇక ఈ విషయం ఎలాగోలా పోలీసుల వరకు వెళ్లడంతో భర్త మీద అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. ఇక అమ్మాయి బాడీ పోస్టుమార్టం నిర్వహించగా బయటపడిన నిజంతో అందరూ షాక్ అయ్యారు.  సదరు యువతిని ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది దీంతో తర్వాత భర్త కూడా నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: