పార్టీ గత ఏడాది ప్రకటించిన రాష్ట్ర కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన శేషు అప్పట్నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ అప్పగించిన ప్రతి పనిని తూచా తప్పకుండా చేస్తున్నారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ పరిశీలకులుగా వెళ్లిన శేషు.... ఇటీవల కృష్ణా జిల్లాలో పార్టీ విజయం సాధించిన కొండపల్లి మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడిగా కూడా వెళ్లారు. కొండపల్లి మున్సిపాలిటీలో అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనంద రావుతో కలిసి వైసిపి ప్లాన్ చేసిన దొంగ ఓట్లకు చెక్ పెట్టడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ క్రమంలోనే జగన్ నాడు - నేడు కాన్సెప్ట్ను రివర్స్లో ఎలా ఎటాక్ చేయాలో శేషు ఓ ప్లాన్ను రూపొందించారు. నాడు జగన్ హామీలు.. నేడు వైఫల్యాలు అన్న టైటిల్తో వచ్చే ఎన్నికల్లో బలంగా ప్రచారం చేయాలని లోకేష్కు వివరించారు. ఈ కాన్సెఫ్ట్ను సైతం లోకేష్ ప్రత్యేకంగా మెచ్చుకుని శేషును అభినందించారు. బీసీల్లో బలమైన గౌడ సామాజిక వర్గం మంచి మంచి భవిష్యత్తు ఉన్న నేతగా.. శేషు నిలుస్తాడని పార్టీ సీనియర్లు సైతం ఆకాంక్షిస్తున్నారు.