
అలాగే కర్నూల్ లో ఆళ్లగడ్డ , కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నడుస్తుంది .. ప్రధానంగా భూమా అఖిలప్రియ తో కలిసి నడిచేది లేదని నాలుగు మండలాల నాయకులు హై కమాండ్ కు తేల్చి చెప్పేశారు .. ఇక దీంతో స్థానికంగా ఉన్న నాయకులతోనే కలిసి వారు మహానాడుకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు .. అయితే ఇప్పుడు వీరికి బస్సులు ఇవ్వద్దని వాహనాలు ఏర్పాటు చేయోద్దని ఎమ్మెల్యే హోదాలో ఉన్న అఖిల ప్రియ గట్టి ఆంక్షలు పెడుతున్నారు .. దీంతో సమీప ప్రాంతాలకు చెందిన స్కూలు యజమానుల బస్సులు ఎవరికి కేటాయించారు తెలియని పరిస్థితి అక్కడ ఏర్పడింది .
ఆర్టీసీ అధికారులు కూడా ఎమ్మెల్యే అఖిల్ ప్రియా ఇలానే ఆదేశాలు జారీ చేశారు. ఇక కర్నూలు జిల్లాలో కూడా కేఈ ప్రభాకర్ పార్టీ విధానాల్లో కాకుండా తన సొంత మా నాన పోతున్నారు .. తన వర్గాన్ని కలుపుకొని వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే మంత్రి టీజీ భరత్ బస్సులు పెడతాను అని చెప్పినప్పటికీ కేఈ వర్గం మౌనంగా ఉంది .. ఇక తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తాను ఒక్కడనే వెళ్లి మహానాడులో కూర్చుంటాను నియోజకవర్గంలో పార్టీ తరఫున ఎవర న్నితీసుకువచ్చే విషయం ఆయన పట్టించుకోవడం లేదు .
అలాగే విజయవాడలోని పశ్చిమంలో అసలు పార్టీ తరపున ఎవరూ కూడా కార్యకర్తలను పట్టించుకోవటం లేదు .. అయితే ఇక్కడ వాస్తవానికి బుద్ధ వెంకన్నకు మహానాడులో కీలక బాధ్యతలు అప్పగిస్తారు అనుకున్నారు .. కానీ ఆయన పేరు ఎక్కడా కనిపించలేదు .. ఇక దీంతో ఆయన అలిగారు అయితే పైకి మాత్రం బాగానే ఉన్నా .. అంతర్గతంగా మాత్రం ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .. అయితే ఇప్పటివరకు పశ్చిమ నియోజకవర్గంలో అసలు పార్టీ ఎలాంటి సౌండ్ లేకుండా పోయింది .. ఇక మరి ఈ మహానాడు వేదికగా పార్టీలో ఇంకెన్ని లుక్కులు బయటికి వస్తాయో చూడాలి .