ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది కాలంలో కూటమి సర్కార్ ప్రజల్లో మిశ్రమ అభిప్రాయాలను ఏర్పరచుకుంది. కొంతమంది కూటమి సర్కార్ పాలన అద్భుతంగా ఉందని చెబుతుండగా మరి కొందరు మాత్రం పాలనలో మరిన్ని కీలక మార్పులు అవసరమని అభిప్రాయపడుతున్నారు. అయితే గత ఏడాది కాలంలో లోకేష్ మాత్రం రాజకీయ నేతగా బలపడ్డారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

లోకేష్ మాటతీరు, సమస్యల విషయంలో స్పందించే  తీరు ఆయన పరిణతికి ఉదాహరణ  అని చెప్పవచ్చు. పార్టీలో పట్టు పెంచుకునే విషయంలో లోకేష్ సక్సెస్ అయ్యారు.  పదవుల విషయంలో  సైతం లోకేష్ నిర్ణయమే తుది నిర్ణయం అని సమాచారం అందుతోంది.  మంత్రిగా లోకేష్ ప్రశంసలు అందుకుంటూనే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్ఛే విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.  కూటమి పార్టీలకు లోకేష్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

భవిష్యత్తులో లోకేష్ మరింత బలవంతుడు కావడం ఖాయమని  2029 ఎన్నికల సమయంలో లోకేష్ ను సీఎం  అభ్యర్థిగా ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. చంద్రబాబు తర్వాత కూటమిలో ప్రాధాన్యత కలిగి ఉన్న నేత లోకేష్ అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. కార్యకర్తలకు సైతం తగిన ప్రాధాన్యత ఇస్తుండటం లోకేష్ కు ప్లస్ అవుతోంది. లోకేష్ నాయకత్వాన్ని  యువతరం టీడీపీ నాయకులు సైతం కోరుకుంటున్నారు.

లోకేష్  భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.  నారా లోకేష్ సైతం విమర్శలకు తావివ్వకుండా అడుగులు వేస్తున్నారు. నారా లోకేష్  రాబోయే రోజుల్లో ఎలాంటి  ప్రణాళికలతో ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.  నారా లోకేష్  భవిష్యత్తులో   రాజకీయాల్లోకి రావాలని  అనుకునే ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.  లోకేష్ రాజకీయాల్లో మరిన్ని  సంచలనాలను సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: