తాజాగా నీట్ పరీక్ష ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పోల్చి చుస్తే ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులే ఈ పరీక్షలో మెరుగైన ఫలితాలను సాధించారు. ఐతే ప్రముఖ తెలుగు రాష్ట్రాల పత్రికలలో యాడ్స్ చూస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ కాలేజీలే ర్యాంకులు సాధించినట్టు ఉంది. అయితే ఆ యాడ్స్ ను జాగ్రత్తగా గమనిస్తే ఆ యాడ్స్ ఎంత మోసపూరిత యాడ్స్ అనే ప్రశ్నకు సులువుగా జవాబు దొరుకుతుంది.

ఒక  ప్రముఖ కాలేజ్ ఒక పత్రికకు యాడ్స్ ఇస్తే మరో ప్రముఖ కాలేజ్ మరో పత్రికకు యాడ్ ఇచ్చింది.  అసలు కాలేజీలు లేని ప్రాంతాలలో వఛ్చిన ర్యాంకులను సైతం తమ కాలేజ్  ర్యాంకులని ప్రచారం చేసుకోవడం ఈ కాలేజీలకు ఎలా సాధ్యమవుతుందో  అర్థం కావడం లేదు.  తమ మెటీరియల్ ప్రిపరేషన్ తో విద్యార్థికి  ర్యాంక్ వచ్చిందని అద్భుతంగా ప్రచారం చేసుకోవడం ఈ కాలేజీలకు  చెల్లుబాటైంది.

ర్యాంకులను సైతం రెండు ప్రముఖ కాలేజీలు ఇష్టానుసారం పంచేసుకున్నాయి.  100 లోపు  కేవలం 11 ర్యాంకులు మాత్రమే తెలుగు రాష్ట్రాలకు సొంతం కాగా  వాస్తవాలకు యాడ్స్ కు పొంతన లేదు.  ఈ యాడ్స్ ను నమ్మి  సామాన్య, మధ్య తరగతి వర్గాల  ప్రజలు మోసపోతున్నారు.  ఫస్ట్  ర్యాంక్  వచ్చిన విద్యార్థిని  ఒక సంస్థ క్లాస్ రూమ్ స్టూడెంట్ అని  క్లెయిమ్ చేసుకుంటే మరో సంస్థ ప్రిపరేషన్ స్టూడెంట్ అంటూ క్లెయిమ్ చేసుకుంది.

ఈ కాలేజీలకు ప్రముఖ సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.  18వ  ర్యాంకును తెలుగు స్టేట్స్ టాప్ ర్యాంకు అంటూ మరో సంస్థ క్లెయిమ్ చేసుకుంది.  తమ మెటీరియల్ ను చదివారని, తమ వెబ్ సైట్ లో మాక్ టెస్ట్ లు రాశారని చెప్పి  ఆ ర్యాంకులను  సైతం కాలేజీలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో చూడాల్సి ఉంది.   ర్యాంకుల కార్పొరేట్ మాయాజాలం గురించి  తీన్మార్ మల్లన్న లాంటి నేతలు ప్రశ్నిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: