
ఫలితంగా స్థానిక జీవనాధారాలు అయిన చేపలు, కొబ్బరి తోటలు నష్టపోతున్నాయి. ఈ పరిణామం మానవ తప్పిదాల వల్లే సంభవించింది. భూతాపం, పట్టణీకరణ, వనరుల దుర్వినియోగం దీనికి ప్రధాన కారణాలు అని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని ముందుగానే గ్రహించిన తువాలు ప్రభుత్వం, తమ ప్రజలను రక్షించేందుకు ఫాలేపిలీ యూనియన్ ఒప్పందం పేరుతో ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా తువాలు ప్రజలకు ఆస్ట్రేలియాలో విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఇప్పటికే దాదాపు 8,750 మంది తువాలు ప్రజలు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు. వీరికి లాటరీ విధానంలో వీసాలు మంజూరయ్యాయి.
ఈ కథలో దాగిన సత్యం మనందరినీ చెలించాల్సిందె. తువాలు ఇచ్చే హెచ్చరిక స్పష్టంగా ఉంది – “ఇంకా సమయం ఉంది! పర్యావరణాన్ని కాపాడుకోండి. లేకపోతే మేము మాయం అయినట్టు, మీరు కూడా మాయం కావచ్చు!” తువాలుతో పాటు బంగ్లాదేశ్, మాల్దీవులు, ఫిజీ దేశాలు కూడా ప్రమాదానికి లోనయ్యే పరిస్థితిలో ఉన్నాయి.ఒక గ్రామం కాదు, ఒక జిల్లాకూడా కాదు – ఓ సంపూర్ణ దేశం సముద్రంలో మాయమవుతుంటే, మనం ఇప్పటికీ గట్టిగా స్పందించకపోతే ఇది మానవాళికి సంకెతమే అవుతుంది. తువాలు అనుభవం మన భవిష్యత్కు అద్దం వేసింది. ఇప్పుడు మారకపోతే రేపటి ప్రపంచమే ప్రశ్నార్థకం. తువాలు నేడు… మనమే రేపా?