“నాకు తక్కువేంటీ?” అంటూ యనమల ఆవేదన..! వయసు ఏడున్నర పదులకు దగ్గరగా ఉన్న యనమల, ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి గుడ్బై చెప్పారు. ఇంత సుదీర్ఘమైన సేవలకు గుర్తింపు లభించకపోవడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. “పార్టీకి క్లిష్ట కాలాల్లో అండగా నిలిచా.. రాజకీయాలకు న్యాయం చేశా.. గవర్నర్ పదవిలో ఇంకోసారి ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నా” అన్న భావనలు ఆయన హృదయంలో ఇంకా మిగిలే ఉన్నాయి. కేంద్ర బీజేపీ లెక్కలు వేరే! .. ఏపీకి ఇప్పటికే గవర్నర్ పదవి ఇచ్చిన నేపథ్యంలో ఇంకో అవకాశం రావడం కష్టమేనన్నదే బీజేపీ వర్గాల్లో చర్చ. మళ్లీ ఆ అవకాశం వస్తే కేఈ కృష్ణమూర్తికి ఇస్తారన్న ప్రచారం యనమల వర్గానికి మరింత కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బీజేపీ పెద్దల నిర్ణయాల్లో టీడీపీ పాత్ర మితమైనదే అన్న మాట వినిపిస్తోంది.
"పార్టీ ఇచ్చింది తక్కువేం కాదు" అన్న టాక్ కూడా ఉంది .. విపక్షంలోనూ, అధికారంలోనూ యనమలకు పదవులు దక్కాయి. కుమార్తె ఎమ్మెల్యే, అల్లుడు ఎంపీ, వియ్యంకుడు కూడా ఎమ్మెల్యే. దాంతో పార్టీ ఇప్పటికే అతిధి సత్కారం చేసిందన్న వాదన కూడా వస్తోంది. అందుకే రాజ్ భవన్కి ఇక దూరమే అన్న భావన పార్టీ నేతల్లో బలపడుతోంది. గౌరవ విరమణ కల నెరవేరదా? .. ఇప్పుడే గవర్నర్ పదవి రాకపోయినా.. యనమల లాంటి సీనియర్ నేతలకు గౌరవమైన స్థానం ఇవ్వాలని కొన్ని వర్గాలు కోరుకుంటున్నాయి. కానీ రాజకీయాల్లో చివరి నిర్ణయం మాత్రం కాలానికే చెందుతుంది. “వైట్ అంబాసడర్”లో వచ్చిన యనమల.. “రాజ్ భవన్”లో మాత్రం స్టాప్ కావాలనుకున్నా.. ఆ గేట్ ఇప్పట్లో ఓపెన్ కావడం కనిపించడం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి