వరల్డ్ క్లాస్ ప్లేయర్ గా గుర్తింపు సంపాదించుకున్న రిషబ్ పంత్ ఆ స్థాయిలో ప్రదర్శన మాత్రం చేయలేక పోయాడు అని చెప్పాలి. అదే సమయంలో ఇక భారత పర్యటనకు వచ్చిన సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో కూడా పెద్దగా తన ప్రదర్శన తో ఆకట్టుకోలేక పోయాడు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే తనపై విమర్శలు చేస్తున్న వారందరికీ కూడా ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు రిషబ్ పంత్. టి20 తరహాలో మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 146 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో కూడా 57 పరుగులతో రాణించాడు.
ఈ క్రమంలోనే ఎంతో దూకుడుగా ఆడే రిషబ్ పంత్ ను ఐదవ స్థానంలో కాకుండా ఓపెనర్ గా పంపిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ఇటీవల ఇదే విషయంపై మాట్లాడిన మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా తరపున గిల్ క్రిస్ట్ వైట్ బాల్ క్రికెట్ ఎలా ఆడాడో.. ఇక ఆరు ఏడు స్థానాల్లో వచ్చి టెస్టుల్లో కూడా విధ్వంసం సృష్టించేవాడు అంటూ సునీల్ గవాస్కర్ గుర్తుచేశాడు. అతడి లాగానే ప్రస్తుతం టీమిండియాకు రిషబ్ పంత్ ఉన్నాడని ఎక్కువ ఓవర్లు ఆడే చాన్స్ వస్తే రిషబ్ పంత్ కూడా అదే విధ్వంసం సృష్టిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే అతన్ని టి20 లలో ఓపెనర్ గా పంపితే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి