మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాయండి. పదినిమిషాల తర్వాత మెత్తగా,నెమ్మదిగా అక్కడ మసాజ్ చేయాలి.కొంచెం సేపు అయ్యాక ముఖం కడుక్కుంటే సరి. అలాగే నిమ్మ,తులసి ఆకుల రసం సమపాళ్ళలో లిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించాలి.బంగాళాదుంపల రసం కూడా ముఖాన్ని కాంతివంతం చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ బంగాళాదుంప రసాన్ని తీసి ముఖానికి రాసుకోండి. అర్ధగంట వరకూ అలాగే ఉంచండి. వారానికి రెండు,మూడు సార్లు ఇలా చేయడం వల్ల టాన్ తగ్గుతుంది.పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్లో ఉంచండి.
రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు,పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతోపాటు నలుపు రంగును దూరం చేస్తుంది.అలాగే వారానికి రెండు సార్లు తప్పకుండా శనగపిండి,పసుపుతో నలుగు పెట్టుకోవాలి.ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మట్టి తొలగిపోతుంది. చర్మం మృదువుగా మారుతుంది. నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి.ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కోవాలి ఇలా చేయడం వల్ల చర్మం చామనచాయ రంగులోకి వస్తుంది..కారణం ఏదయినా కానీ మీ చర్మం నలుపు రంగులో మారితే పైన చెప్పిన చిట్కాలు పాటిస్తే మీ చర్మం తెల్లగా మారుతుంది.. !!
Powered by Froala Editor
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి