ఈరోజు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని... ప్రభుత్వం ఏ ఒక్కరికీ అన్యాయం చేయదని చెప్పారు. ఆ గ్రామాలలో మంచి ఆస్పత్రిని ఏర్పాటు చేసి వైద్యులను నియమించాలని అధికారులను ఆదేశించానని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన పాపం చంద్రబాబుదే, గత ప్రభుత్వాలదే అని జగన్ అన్నారు. 
 
చంద్రబాబు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడే ఆ సంస్థ టేకోవర్ జరిగిందని... 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మరిన్ని అనుమతులు ఇచ్చారని... వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎల్జీ పాలిమర్స్ సంస్థకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. రాజకీయాలు చేయకుండా జగన్ సర్కార్ మానవత్వంతో స్పందించిందని జగన్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: