భారత్ని ప్రపంచ ఆయుధ తయారీ పరిశ్రమకు కేంద్రబిందువుగా మార్చడమే తమ లక్ష్యమని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు దేశీయ రక్షణ పరికరాల వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు ఇటీవలి కాలంలో కేంద్రం అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చింది. కొత్త నిబంధనావళితో రక్షణరంగంలో త్వరితగతిన పరిశోధన- అభివృద్ధి ప్రాజెక్టులు పట్టాలెక్కేందుకు మార్గం సుగమం కానుందని రక్షణశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. వచ్చే ఐదేళ్ల వ్యవధిలో సైనికులకు ఆయుధాలను సమకూర్చేందుకే కేంద్రం 13వేల కోట్ల డాలర్ల మేర వ్యయం చేయనుంది.
భారత్ని ప్రపంచ ఆయుధ తయారీ పరిశ్రమకు కేంద్రబిందువుగా మార్చడమే తమ లక్ష్యమని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు దేశీయ రక్షణ పరికరాల వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు ఇటీవలి కాలంలో కేంద్రం అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చింది. కొత్త నిబంధనావళితో రక్షణరంగంలో త్వరితగతిన పరిశోధన- అభివృద్ధి ప్రాజెక్టులు పట్టాలెక్కేందుకు మార్గం సుగమం కానుందని రక్షణశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. వచ్చే ఐదేళ్ల వ్యవధిలో సైనికులకు ఆయుధాలను సమకూర్చేందుకే కేంద్రం 13వేల కోట్ల డాలర్ల మేర వ్యయం చేయనుంది.