భద్రత బలగాలపై ప్రశంసలు కురిపించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సైన్యం ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తుందని కొనియాడారు. నాలుగు రోజుల పాటు భారత సైన్యం కమాండర్ల భేటీ నేపథ్యంలో సరిహద్దుల్లో పరిస్థితులపై సమగ్రంగా సమీక్షించారు.


దేశ భద్రత బలగాలను, వారి ఆయుధాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుందన్నారు రక్షణమంత్రి. 'నిన్న రోజు ఢిల్లీలో జరిగిన ఆర్మీ కమాండర్ల సమావేశంలో ప్రసంగించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో భారత సైన్యం వ్యవహరిస్తున్న తీరు ఎంతో గర్వంగా ఉంది' అని  రాజ్​నాథ్​ సింగ్ అన్నారు.భారత-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య ఎన్నోసార్లు చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: