![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/business/technology_videos/business-61df9bf6-6318-4533-a4d7-2c4776189d06-415x250.jpg)
ఆన్ లైన్ అయినా, ఆఫ్ లైన్ అయినా బిర్యానీ అంటే చాలు నోరూరాల్సిందే. కరోనా టైం లోనూ ఇదే డిమాండ్ వెల్లువెత్తిందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిమిషానికి 115 బిర్యానీ ప్లేట్లకు ఆర్డర్ వచ్చిందంటేనే బిర్యాని దమ్మేంటో అర్థమవుతుంది. గతేడాదే కాదు ఈ ఏడాది కూడా అత్యధికంగా ఆర్డర్ పెట్టింది బిర్యానీనేనట. 2021లో ఆన్లైన్ లో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ డిష్ వివరాలను ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గి రిలీజ్ చేసింది. నిమిషానికి 115 ప్లేట్ల ఆర్డర్స్ తో బిర్యానీ టాప్ పొజిషన్లో నిలిచినట్లు స్విగ్గి వెల్లడించింది. ఆరవ వార్షిక నివేదిక స్టేటిస్టిక్స్ రిపోర్టులో పలు విషయాలను కంపెనీ పేర్కొంది. ఈ ఏడాదిలో సుమారు 4.25 లక్షల మంది కొత్త యూజర్లు స్విగ్గి లో చేరినట్లు కంపెనీ ప్రకటించింది.