ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఏ రేంజిలో పెరిగిపోతున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి సమయంలోనే సైబర్ నేరగాళ్ల వలలో పడి ప్రజలు మోసపోకుండా ఉండేందుకు ఇక ఎప్పటికప్పుడు ప్రజలకు  సైబర్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కానీ ఏదో ఒక విధంగా అమాయకులను టార్గెట్గా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే సైబర్ నేరాలు ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న టెలీకాలర్లపై కూడా సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.. ఇక ఇప్పటి వరకూ టెలి కాలింగ్ సర్వీస్ లను నిర్వహిస్తున్న నిర్వాహకులను మాత్రమే అరెస్టు చేసే వారు. కానీ ఇప్పుడు మాత్రం టెలీకాలర్ లను  కూడా వదిలేసే ప్రసక్తే లేదు అన్నది తెలుస్తుంది.


 ఎందుకంటే నేరాలను అరికట్టడానికి లో సూత్రధారుల తో పాటు పాత్రలను కూడా అరెస్టు చేయడం తప్పనిసరి అని అందుకే టెలీకాలర్ లపై  చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాము అంటూ పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇక ఇటీవలే జాబ్ ఫ్రాడ్ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మహిళలను అరెస్టు చేయగా.. మరో 60 మందికి కూడా నోటీసులు జారీ చేయడం గమనార్హం. లోన్ యాప్స్,జాబ్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, కేవైసీ అప్డేట్ లాంటి వాటిపై జరిగే నేరాలకు ఉత్తరాది తో పాటు బెంగుళూరులో ఉన్న కాల్ సెంటర్లు  అడ్డాలుగా మారిపోయాయి. కొంతమంది మోసగాళ్లు ప్రత్యేకంగా టెలీకాలర్ లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఎంతో మందికి ఫోన్లు చేయిస్తున్నారు.


 ఎదుటివారితో ఆకర్షణీయంగా మాట్లాడి వల వేయడానికి  ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది.. ఇక ఇలా టెలీకాలర్ గా పని చేస్తున్న వారిలో అత్యధిక మంది మధ్య, దిగువ మధ్యతరగతి యువతులే ఉండడం గమనార్హం. అయితే గత కొన్ని రోజుల వరకు సూపర్వైజర్లు మేనేజర్లను మాత్రమే అరెస్టు చేసే వారు. టెలీకాలర్ లకు కౌన్సిలింగ్ చేసి వదిలిపెట్టారు. ఇక కాల్ సెంటర్ నుంచి బయటికి వచ్చి మరో కాల్ సెంటర్ లో చేరి ఇక ఇదే పని చేస్తున్నారు టెలీకాలర్లు. దీంతో వారిని కూడా అరెస్టు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల పూర్తిగా నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: