ఇటీవలి కాలంలో చిన్నచిన్న కారణాలకే మనుషులు ఉన్మాదులు గా మారిపోయి సాటి మనుషుల ప్రాణాలు దారుణంగా తీస్తున్న ఘటనలు రోజురోజుకీ ఎక్కువగానే తెరమీదికి వస్తున్నాయ్. ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిలో భయాందోళనలకు కారణం అవుతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎప్పుడు ఎవరు ఎటు వైపు నుంచి దాడి చేసి ప్రాణాలు తీస్తారో అని భయంతోనే ప్రతి ఒక్కరూ బ్రతికేస్తున్నారు. ఎందుకంటే నేటి రోజుల్లో మనుషుల్లో మానవత్వం కాదు రాక్షసత్వమే ఎక్కువగా కనిపిస్తుంది. సాటి మనుషుల ప్రాణాలు తీస్తే జైలు జీవితం గడపాల్సి వస్తుందన్న భయం కూడా ఎవరిలో కనిపించడం లేదు అని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటి ఓ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. ఇక్కడ జరిగిన హత్యకు గల కారణం తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటారు అనే చెప్పాలి. తినేందుకు రోటి ఇవ్వలేదు అనే కారణంతో ఓ వ్యక్తిని దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. కరోల్ భాగ్ ప్రాంతంలో జరిగిన హత్య పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల నిందితున్ని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. వివరాల్లోకి వెళితే.. రిక్షా లో ఇద్దరు వ్యక్తులు కలిసి భోజనం చేస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఫుల్లుగా మద్యం తాగిన ఒక వ్యక్తి సడన్గా అక్కడికి వచ్చాడు. తనకి కూడా కొంచెం భోజనం పెట్టాలి అంటూ అడిగాడు. అయితే ఇక రిక్షా లో కూర్చుని భోజనం చేస్తున్నా మున్నా అనే వ్యక్తి రోటి ఇచ్చాడు.  మద్యం తాగిన వ్యక్తి అక్కడితో ఊరుకోకుండా మరో రోటి ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. అందుకు మున్నా నిరాకరించాడు. దీంతో అతని తో వాగ్వాదానికి దిగి తన వద్ద ఉన్న కత్తిని తీసి దారుణంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో వెంటనే స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు ఆగ్రాకు చెందిన 26 ఏళ్ల ఫిరోజ్ ఖాన్ గా గుర్తించి అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: