
అయితే ఒకప్పుడైతే 25 ఏళ్ల లోపే పెళ్లిళ్లు చేసుకునేవారు అందరూ. కానీ ఇప్పుడు మాత్రం 30 ఏళ్ళు దాటిన తర్వాత కూడా వివాహం చేసుకోవడానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం పెళ్లిళ్లు కావడం లేదని మనస్థాపం చెందుతున్న వారు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి సెట్ కావడం లేదు అనే మనస్థాపంతో కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఇటీవల ఒక యువకుడు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చాడు.
పెళ్లి కావడంలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం సన్యాస పాలెం గ్రామంలో మురళి అనే యువకుడు ఉంటాడు. అయితే అతనికి ఇప్పటికే 37 ఏళ్ళు వచ్చాయి. ఇప్పటివరకు వివాహం కాలేదు. ఇక పెళ్లి కాలేదు అనే బాధతో మురళి డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. చివరికి మనస్థాపంతో గడ్డి మందుతాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మురళి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.