
తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె ఎంగేజ్మెంట్కు కూడా లోకేషే వెళ్లారు. ఈ మార్పు వెనుక స్పష్టమైన వ్యూహం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. భవిష్యత్తులో పార్టీ బాధ్యతలను పూర్తిగా నారా లోకేష్కే అప్పగించే అవకాశం ఉండటంతో, ఆయనను ప్రతి కోణంలోనూ మెల్లగా ముందుకు తీసుకువెళ్లాలని చంద్రబాబు యోచిస్తున్నారని అంటున్నారు. కేవలం రాజకీయ కార్యక్రమాలకే కాకుండా, ఆత్మీయ సందర్భాలలోనూ లోకేష్ హాజరవడం వల్ల ఆయా కుటుంబాలకు మరింత చేరువ అవుతున్నారు. ఇది వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్ను పెంచడమే కాకుండా, పార్టీ పట్ల విశ్వాసాన్ని కూడా బలపరుస్తుంది.
సీనియర్ నేతలు కూడా ఈ వ్యూహాన్ని సమర్థిస్తున్నారు. లోకేష్కి ఇస్తున్న ప్రాధాన్యం టీడీపీ భవిష్యత్ దిశలో ఒక మంచి అడుగు అని వారు భావిస్తున్నారు. అంతేకాదు, ఈ తరహా కలయికలు ఆయనకు వ్యక్తిగత సంబంధాలను బలోపేతం చేస్తూ, రాజకీయ పునాదులను కూడా గట్టి చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఈ మార్పును క్రమంగా అమలు చేస్తూ, భవిష్యత్తు నాయకుడిగా లోకేష్ను ప్రతిష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది.టీడీపీలో నారా లోకేష్ ప్రాధాన్యం పెరుగుతుండటం చూస్తుంటే త్వరలోనే పార్టీ పూర్తి బాధ్యతలు ఆయన భుజాలపై పడేందుకు ముందస్తు సంకేతాలను ఇస్తోంది.