వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో  జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు బారిన పడాల్సిందే. ఈ సమస్యలు మనల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. వీటి కారణంగా జ్వరం ఇంకా తలనొప్పి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. చాలా మంది కూడా ఈ జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి బయటపడడానికి యాంటీ బయాటిక్ లను, సిరప్ లను వాడుతూ ఉంటారు. వీటిని తాగడం వల్ల ఉపశమనం ఉన్నా కానీ వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల ఖచ్చితంగా చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అందుకే ఈ సమస్యలకు ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాసుల నీటిని తీసుకోని ఆ తరువాత ఇందులో ఒక ఇంచు అల్లం ముక్కను దంచి వేసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఒక బిర్యానీ ఆకు ముక్కలను కూడా వేసుకోవాలి. ఆ తరువాత 4 మిరియాలను, 2 యాలకులను, 4 లవంగాలను పొడిగా చేసి ఆ నీటిలో వేసుకోవాలి.ఆ తరువాత ఈ నీటిలో పావు టీ స్పూన్ నల్ల ఉప్పును, 6 నుండి 7 తులసి ఆకులను , ఒక చిన్న నల్ల బెల్లం ముక్కను, అర టీ స్పూన్ వామును ఇంకా అర టీ స్పూన్ దాల్చిన చెక్క ముక్కను వేసుకోవాలి.


తరువాత ఈ నీటిని 5 నిమిషాల పాటు బాగా మరిగించి తరువాత ఇందులో అర టీ స్పూన్ పసుపును వేసి కలపాలి.ఆ తరువాత ఈ నీటిని సగం అయ్యే దాకా బాగా మరిగించాలి.ఆ తరువాత ఈ నీటిని వడకట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి.ఇక ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజుకు మూడు పూటలా పూటకు ఒక కప్పు మోతాదులో గోరు వెచ్చగా తాగాలి.ఇలా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతులో పేరుకుపోయిన కఫం ఇంకా అలాగే ఛాతిలో మంట వంటి శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాము. ఇంకా ఈ కషాయంలో వాడిన పదార్థాలన్నీ కూడా సహజ సిద్దమైనవే. అందువల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ టిప్ ని పాటించడం వల్ల మనం చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: