అక్కినేని హీరో నాగ చైతన్యకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవలి కాలంలో చైతూ నటించిన లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలు మంచి విజయం సాధించగా, ఇప్పుడు ఆయన తదుపరి ప్రాజెక్ట్స్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.అయితే ఈ ఏడాది ఆరు నెలల వ్యవధిలో బ్యాక్ టు బ్యాక్ మూడు ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అదేంటంటే రెండు సినిమాలు ఓ వెబ్ సిరీస్ తో తన సత్తా చాటుకోబోతున్నాడు.ఇకపోతే నాగచైతన్య హీరోగా నటిస్తున్న మూవీ ‘థాంక్యూ’. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె. కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.కాగా  రాశీఖన్నా అవికా గోర్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అయితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇకపోతే  చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈమూవీ జూలై 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇకపోతే  ఇందులో మహేష్ బాబు హార్డ్ కోర్ ఫ్యాన్ గా నాగచైతన్య కనిపించబోతున్నారు.ఇకపోతే ఈ మూవీ తరువాత బాలీవుడ్ క్రేజీ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ రిలీజ్ కాబోతోంది. ఇక బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీని హాలీవుడ్ పాపులర్ ఫిల్మ్ ‘ది ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. ఇక చై నటిస్తున్న తొలి బాలీవుడ్ ఫిల్మ్ ఇది.

ఇకపోతే ఇదే ఏడాది నాగచైతన్య వెబ్ సిరీస్ తో డిజిటల్ వరల్డ్ లోకి ప్రవేశిస్తున్నారు.కాగా  ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె. కుమార్ అమెజాన్ ప్రైమ్ కోసం డైరెక్ట్ చేస్తున్న ‘దూత’ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.అయితే  10 భాగాలుగా ఈ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇలా ఆరు నెలల కాలంలో బ్యాక్ టు బ్యాక్ మూడు రిలీజ్ లతో నాగచైతన్య ఆకట్టుకోబోతున్నాడు. ఇక వీటీ తరువాతే వెంకట్ ప్రభుతో చేయనున్న బై లింగ్వువల్‌ ప్రాజెక్ట్ థియేర్లలోకి రానుంది.ఇకపోతే  పరశురాంతో ఓ చిత్రం డీజే టిల్లు దర్శకుడితో కూడా చిత్రం చేయనున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: