ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తూనే ఉన్నది. అగ్ర హీరోలకు దీటుగా యువ హీరోలు సైతం ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలలోనే నటిస్తూ ఉన్నారు. ఒకవైపు హీరోగా మరొకవైపు రైటర్ గా కూడా బాగా పేరు సంపాదించారు హీరో అడవి శేషు. ఇటీవల మేజర్ చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించారు. అయితే ఈసారి కూడా ఇలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


మేజర్ సినిమా ఇమేజ్తో తను గతంలో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రమైన గూడచారి సినిమా సీక్వెల్ ను తలకెక్కించాలని ఉద్దేశం లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. స్పై ఆపరేషన్ తరహా నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది దీంతో ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ తరహా కథలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. ఇక ఈ సినిమా సీక్వెలను తీయడానికి సిద్ధమైనట్లుగా టాక్ వినిపిస్తోంది. అడవి శేషు కూడా రైటర్ కావడంతో ఈ సినిమాకి కథ రాసుకొని అదే తరహా కాన్సెప్ట్ లో సినిమాని తెరకెక్కిస్తున్నారు..


ఇక ఇప్పుడు తాజాగా అలాగే హిట్-2 సినిమా సీక్వెల్ లో కూడా నటిస్తున్నారు. తాజాగా మేజర్ సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో విడుదల అయింది. HIT -2 సినిమాని పలు భాషలలో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమా కూడా కచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని అడవి శేషు చాలా ధీమాగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో గూఢచారి  సినిమాకి కొనసాగింపు ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం అడవి శేషు తన కుటుంబంతో కలిసి అమెరికాలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికా నుంచి తిరిగి రాగానే ఈ సినిమా సీక్వెల్ ప్రారంభమవుతుంది అన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇది నిజమో కాదో తెలియాలి అంటే కొద్దిరోజు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: