మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాను దసరాకు విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నయనతార మరియు సత్యరాజ్ ఇద్దరు కూడా కీలకపాత్రలలో నటించగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అతిధి పాత్ర లో నటించడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ప్రేక్షకులకు నచ్చే విధంగా చేసి మంచి విజయాన్ని అందుకోవాలని మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ల లో కాస్త వెనుకబడి ఉన్న చిత్ర బృందం త్వరలోనే వాటిని విడుదల చేసి ఈ సినిమాపై క్రేజ్ తెచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని చూస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆసక్తిపరచగా టీజర్ ప్రేక్షకులలో అనుకున్న  బస్ ఏర్పరచక పోవడం మెగా అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది అని చెప్పాలి .

వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఈసారి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాకి గ్రేస్ లేకపోవడం కొంతమం దిని ఎంతగానో కలవర పరుస్తుంది. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గత సినిమా ఆచార్య ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోవడం ఈ సినిమాపై ఆ ఎఫెక్ట్ ఏ మైనా పడుతుందా అనడానికి కారణాలను చూపిస్తుంది. మరి దసరాకి విడుదల కాబోతున్న ఈ సినిమాకు క్రేజ్ పెంచడానికి చిత్ర బృందం ఏ ప్రయత్నాలు చేస్తుందో చూడాలి. ఇకపో తే ఇది మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలతో కూడా ఈ ఏడాది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు చిరంజీవి. వాటిలో ఒకటి మెహర్ రమేష్ దర్శకత్వం లోని భోలా శంకర్ సినిమా ఒకటి కాగా మరొకటి బాబీ దర్శకత్వంలోని వాల్తేరు వీరయ్య సినిమా ఒకటి. ఈ సినిమా యొక్క షూటింగ్ ఇప్పుడు జరుపుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: