కేజీఎఫ్ సిరీస్ ఫేం హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ ఈ యాక్షన్ థ్రిల్లర్ను చిత్రాన్ని నిర్మించారు. కన్నడనాట సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సెన్సేషనల్ హిట్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తగ్గడం లేదు, ఈ నేపథ్యంలో ఇతర భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు దర్శకనిర్మాతలు. హిందీలో శుక్రవారం రిలీజ్ కాగా.. తెలుగు నాట శనివారం విడుదలైంది. ఈ కు కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా ఎక్కువగానే దక్కుతున్నాయి. తాజాగా టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్కా శెట్టి కాంతారా ను చూసింది అంట మరి . అనంతరం తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.
'కాంతార ను చూశాను. చాలా బాగుంది. కు పనిచేసిన నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు కంగ్రాట్స్ అంటూ ఇలా వివరించారు . అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అందించిన కాంతార టీంకు ధన్యవాదాలు. హీరో రిషబ్ శెట్టి చాలా అద్భుతంగా నటించాడు. కాంతార ను థియేటర్లలో మాత్రమే చూడండి..మిస్ కావొద్దు' అని ఫ్యాన్స్కు సూచించింది అనుష్క శెట్టి . ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగ వైరల్గా మారింది. ఇదిలా ఉంటే ఇంతకుముందే పాన్ఇండియా స్టార్ ప్రభాస్ రెండు సార్లు కాంతారా ను చూసినట్లు చెప్పుకొచ్చాడు మరీ . అలాగే కోలీవుడ్ స్టార్ ధనుష్ కూడా ఈ అద్భుతంగా ఉందంటూ ట్విట్టర్ వేదికగా అభిమానుల కు తెలిపాడు. కిశోర్, అచ్యుత్ కుమార్, నవీన్ డీ పడ్లి, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో నటించిన కాంతార చిత్రానికి అంజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్, బీజీఎం అందించారు.కన్నడతో పాటు తెలుగు, హిందీ, మలయాళంలోనూ ఈ సినిమా కు బారి వసూళ్ల వర్షం కురుస్తోంది.