కే జీ ఎఫ్
సినిమా తర్వాత
యష్ ఎవరితో
సినిమా చేయబోతున్నాడు అన్న విషయం ప్రతి ఒక్కరిలో ఎంతో ఆసక్తిని కలగజేస్తుం ది. చాలామంది దర్శకుల పేర్లు వినిపించినా కూడా ఎవరితో
సినిమా చేయబోతున్నాడు అనే విషయాన్ని ఇప్పటిదాకా ప్రకటించలేదు. మొన్నటిదాకా
పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఓ
సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వినిపించాయి. కానీ పూరీ చెప్పిన లైన్ కి ఇంట్రెస్ట్ గా లేకపోవడం తో ఆ ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కన పెట్టేశాడు
దాంతో ఇప్పుడు నర్తన్ అనే దర్శకుడు తో
సినిమా చేయడానికి యశ్ సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య ఈ దర్శ కుడు చెప్పిన ఓ కథ ఎంచుకుని ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆదరిస్తుందని భావించి, తప్పకుండా ఈ సినిమాను చేయడానికి అంగీకరిస్తాడని భావించారు. అయితే ఏ
సినిమా కూడా అంతకంతకు ఆలస్యం కావడంతో నర్తన్ చేయబోయే యశ్
సినిమా ఎప్పుడు ఉంటుంది అని ఎంతో ఆసక్తి నెలకొంది.
తాజాగా ఈ దర్శకుడు మరో హీరోతో కూడా కాంటాక్ట్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ కు కథ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ కథ ఓకే అయితే ముందుగా ఈ
సినిమా చేసే విధంగా ప్లాన్స్ చేశాడట. ఆ విధంగా ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి నర్తన్ సిద్ధమవుతున్నాడు. అయితే వీరి లో ఎవరితో ముందుగా
సినిమా ఉంటుంది అనే విషయం ఇంకా తేలవలసి ఉంది.
మెగాస్టార్ చిరంజీవి నర్తన్ చెప్పే కథను ఓకే చేస్తే
రామ్ చరణ్ వెంటనే ఆ
సినిమా చేసే విధంగా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. మరి చాలా రోజుల నుంచి యశ్ కోసం ఎదురుచూస్తున్న నర్తన్
రామ్ చరణ్ తోనే సినిమాను మొదలు పెట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.