
ఇదంతా ఇలా ఉండగా త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని మరొకసారి అల్లు అర్జున్తో నిర్మించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో వీరి కలయికలో వచ్చిన చిత్రాలు అన్నీ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు తాజాగా నాలుగవ సినిమా అని వీరి కాంబినేషన్లో తెరకెక్కిస్తూ ఉండడంతో అటు అభిమానుల సైతం ఈ చిత్రం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ కూడా పుష్ప -2 సినిమా షూటింగ్ గత కొద్ది రోజుల క్రితం మొదలైనట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో కలిసి ఒక భారీ చిత్రాన్ని చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాసుతో సినిమా చేయబోతున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది మధ్యలో మొదలు కాబోతున్నట్లు సమాచారం. ఇక చివరిగా వీరిద్దరి కాంబినేషన్లో అలా వైకుంఠపురం సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. మరి నాలుగవ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి మరి. ఇక అల్లు అర్జున్ ఐకాన్ అనే సినిమా కూడా మధ్యలో నిలిచిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.