
వాల్టేర్ వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమా 74 సెంటర్ లలో 50 రోజులను పూర్తి చేసుకోబోతుంది. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.
వీర సింహా రెడ్డి : నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమా 23 సెంటర్ లలో 50 రోజులను పూర్తి చేసుకోబోతుంది.
వారిసు : తమిళ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ తాజాగా వారిసు అనే మూవీ లో హీరో గా నటించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ 9 సెంటర్ లలో 50 రోజులను పూర్తి చేసుకోబోతుంది.
తునివు : తమిళ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న విజయ్ తాజాగా తునివు అనే మూవీ లో హీరోగా నటించాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో మంజు వారియర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఒక సెంటర్ లో 50 రోజులను పూర్తి చేసుకోబోతుంది.