సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న విషయం మనం అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు ఆఖరిగా నటించిన 4 సినిమాలలో మూడు కూడా వేసవిలో విడుదల కావడం విశేషం. మహేష్ ఆఖరుగా భరత్ అనే నేను ... మహర్షి ... సరిలేరు నీకెవ్వరు ... సర్కారు వారి పాట మూవీ లతో ప్రేక్షకులను పలకరించగా ... అందులో సరిలేరు నీకెవరు సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి మంచి విజయం సాధించగా ... మిగతా 3 సినిమాలు మాత్రం సమ్మర్ కానుకగా విడుదల అయి మంచి విజయాలను అందుకున్నాయి. మహేష్ ... కొరటాల శివ కాంబినేషన్ లో భరత్ అనే నేను మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ 2018 వ సంవత్సరం ఏప్రిల్  20 వ తేదీన సమ్మర్ కానుకగా విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత మహేష్ ... వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ 2019 వ సంవత్సరం మే 9 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. మహేష్ ఆఖరుగా సర్కారు వారి పాట అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి పరుశురామ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. ఇలా మహేష్ నటించిన ఆఖరి 4 మూవీ లలో మూడు కూడా సమ్మర్ లో వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: