తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు అందరి చూపు సూపర్ స్టార్ మహేష్ బాబు,శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వస్తున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రంపైనే ఉంది. గత సంవత్సరం మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతే కాదు మహేష్ కెరీర్ లో 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది. దీంతో ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రంలో మహేష్ సరసన అందమైన భామలు సమంత,కాజల్, ప్రణీత లు నటించారు. ఇక ఈ చిత్రం ప్రమోషన్ వర్క్ లో చిత్ర యూనిట్ బిజీ బిజీగా ఉంది.

మహేష్ బాబు, సమంత,కాజల్,ప్రణీత


ముఖ్యంగా మహేష్ బాబు ఎన్నడూ లేని విధంగా ప్రముఖ చానల్స్ కి ఇంటర్వ్యూలో ఇస్తూ తెగ సందడి చేస్తున్నారు. కుటుంబంలోని బంధాలు బంధుత్వాల చుట్టూ తిరిగే ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుల గుండెకు హత్తుకునేలా ఉంటుందని.. ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా అద్భుతంగా ఉందని అన్నారు మహేష్. ఆ మద్య ఈ చిత్రం ఆడియో వేడుక కూడా చాలా గ్రాండ్ గా జరిగి మంచి సక్సెస్ అయ్యింది. తాజాగా మహేష్ బాబు ఓ యాంకర్ కి భలే షాక్ ఇచ్చారు. ఓ ప్రముఖ చానల్ లో ‘కొంచెం టచ్ లో ఉంటే చెబుతా’ అనే కార్యక్రమం మంచి పాపులర్ అయ్యింది. టాలీవుడ్ సెలబ్రెటీలతో ఈ ఇంటర్వ్యూలో వారి లైఫ్ విషయాలు కూడా షేర్ చేసుకుంటారు. కొంచెం టచ్ లో ఉంటె చెబుతా అంటూ ఓ కార్యక్రమాన్ని యాంకర్ ప్రదీప్ చేస్తున్న విషయం తెలిసిందే.

మహేష్ బాబు, యాంకర్ ప్రదీప్


కాగా ఈ కార్యక్రమానికి మొదటి సారిగా మహేష్ బాబు గెస్ట్ గా వచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ సెలబ్రెటీలతో కాస్త అతిగా చేస్తారని టాక్..కానీ ఈ సారి ప్రదీప్ కే షాక్ ఇచ్చాడు మహేష్ బాబు.  గెస్ట్ గా వెళ్ళిన సూపర్ స్టార్ మహేష్ బాబు ని కొన్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయాలనుకున్న ప్రదీప్ ని  ''నువ్ సినిమాలు చేయకమ్మా..నీకు ఈ టివి షోలే చాలా బెటర్ '' అంటూ సైలెంట్ గా సెటైర్ వేసాడు మహేష్. సాధారణంగా మహేష్ బాబు ఎక్కువగా మాట్లాడరు..కానీ ఆయన మాట్లాడే తీరు మాత్రం కాస్త ఫన్నీగా..సటైరికల్ గా ఉంటాయి. అలాంటి మహేష్ బాబు తో ప్రదీప్ అతి తెలివి చూపిస్తే ఊరుకుంటాడా అందుకే ఇలా పంచ్ ఇచ్చాడట. 


మరింత సమాచారం తెలుసుకోండి: