స్మాల్ బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ స్పీడ్ పెంచబోతున్నాడు. ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ రెస్ట్ లేకుండా వర్క్ చేయబోతున్నట్టు టాక్. ముందుగా రీమేక్ తో రాబోతున్న పవర్ స్టార్ గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తో బాక్సాఫీసు బూజు దులపడానికి ప్లాన్ చేస్తున్నాడట. 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలతో ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉన్నాడు. పవన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ లాయర్ సాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్  లో కూడా పాల్గొంటున్నాడు. కొన్ని రోజులుగా ఈ రెండు సినిమాల షూటింగ్ తో పాటు రాజకీయంతో పవన్ బాగా అలసినట్టున్నాడు. అందుకే ఈ మధ్య షూటింగ్ కు స్మాల్ బ్రేక్ ఇచ్చాడు. 

 

అటు పొలిటికల్, ఇటు సినిమా షూటింగ్స్ తో పవన్ కు అసలు ఖాళీనే లేదు. అయితే ఈ మధ్య రాజకీయ భేటీల సందర్భంగా షూటింగ్ లకు వారం పాటు బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు పొలిటికల్ మీటింగ్ కంప్లీట్ కావడంతో మళ్లీ షూటింగ్ లో జాయిన్ అవుతాడని సమాచారం. లాయర్ సాబ్ సినిమాకు పవన్ కేవలం 28రోజులే డేట్లు కేటాయించాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుండటంతో ఇంకొన్ని సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడని తెలుస్తోంది. 

 

లాయర్ సాబ్ కంప్లీట్ కాగానే హరీష్ శంకర్ తో చేయబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని పవర్ స్టార్ ప్లాన్ చేస్తున్నాడట. క్రిష్ సినిమాకు సమాంతరంగా హరీశ్ శంకర్ సినిమాను ఏక కాలంలో పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడట. ఈ రెండు సినిమాలకు సంబంధించి బల్క్ కాల్ షీట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పింక్ రీమేక్ లాయర్ సాబ్ సినిమాను మే నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు మరో సినిమాను సైతం ఇదే ఏడాదిలో రిలీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: