దాదాపు దశాబ్దం పాటు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న జబర్దస్త్ కామెడీ షో లో ఇటీవల కాలంలో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏడు సంవత్సరాల పాటు జబర్దస్త్ కామెడీ షోకి న్యాయనిర్ణేతగా కొనసాగిన నాగబాబు ఏవో కొన్ని కారణాల వలన వేరొక ఛానల్ కి మకాం మార్చి జబర్దస్త్ షో కి కార్బన్ కాపీగా మరో కామెడీ షో స్టార్ట్ చేశాడు. కానీ ఆ షో జబర్దస్త్ కామెడీ షో కి ఏ మాత్రం పోటీ ఇవ్వడం లేదు. నాగబాబు ఉన్నప్పుడు టిఆర్పి రేటింగులు ఎలా వచ్చాయో... నాగబాబు లేనప్పుడు కూడా టిఆర్పి రేటింగులు అలాగే వస్తున్నాయి. నాగబాబు లోటును భర్తీ చేసేందుకు జబర్దస్త్ యాజమాన్యం అనేకమైన కొత్త ఆలోచనలను ఆచరణలో పెడుతుంది. ఇప్పటికే రోజా పక్కన ఎంతోమందిని న్యాయనిర్ణేతలుగా ట్రై చేసి చివరికి సింగర్ మనో ని కూర్చోబెట్టారు జబర్దస్త్ యాజమాన్యం. 


అయితే తాజాగా ఇంకొక కీలకమైన మార్పు జబర్దస్త్ షోలో చోటు చేసుకుంటుందని తెలుస్తుంది. కేవలం జబర్దస్త్ షో ద్వారానే పాపులారిటీ సంపాదించుకొని ఏకంగా సినిమాల్లో కీలకమైన పాత్రలలో నటించే అవకాశాలు దక్కించుకుంటున్న అనసూయ, రష్మి గౌతమ్ యాంకర్ గా పని చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ జబర్దస్త్ షో ప్రారంభమైన దగ్గరనుండి ఆ షో లో నే కొనసాగుతున్నారు. గడిచిన ఎనిమిది సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు వీళ్లిద్దరు తప్ప మరే ఇతర యాంకర్ రాలేదంటే నమ్మండి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ షో లో మరొక హాట్ యాంకర్ అరంగేట్రం చేస్తోందని తెలుస్తోంది. 


తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ మంజూష గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే మంజూష చాలా బిజీ అయిపోతుంది. కేవలం ఆడియో ఫంక్షన్ లకు మాత్రమే కాదు అనేకమైన ఈవెంట్లలో కూడా మంజూష బాధ్యతలు చేపడుతుంది. గతంలో రాఖీ సినిమాలో నటించిన ఈమె ప్రస్తుతం ప్రముఖ సినీ నటులు ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఉంటుంది. ఒకానొక సమయంలో జబర్దస్త్ షో లో హైపర్ ఆది స్కిట్ లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన మంజూష ఇప్పుడు ఆ షోకే పరిమితమవుతుందని టాక్ వినిపిస్తుంది. అలాగే అనసూయ రష్మీ ల లో ఎవరో ఒకరు జబర్దస్త్ నుండి వైదొలుగుతున్నట్లు తెలుస్తుంది. మరి మంజూష ఎన్ని రోజుల్లో జబర్దస్త్ షో లో ఎంట్రీ ఇస్తుందో చూడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి: