ప్రస్తుతం ఉన్న హీరోలలో చాలా తక్కువ మంది తమ సినిమాల్లో రైన్ సాంగ్స్ చేశారు అని చెప్పాలి . ఇలా రైన్ సాంగ్స్ చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించి అలరించిన హీరోలలో ప్రభాస్ మొదటి వరుసలో ఉంటాడు, ఎందుకంటే ప్రభాస్ ఇప్పటికి మూడు సార్లు తన సినిమాల్లో రైన్ సాంగ్స్ చేసి అలరించాడు . రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ మొదట్లో అడవి రాముడు సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలు ఆనాడు నందమూరి తారక రామారావు చేసిన చేసిన ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనే పాటను రీమిక్స్ చేశారు. అయితే ఆనాడు ఎన్టీఆర్ చేసిన పాటలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి నటించగా... ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక ప్రభాస్ హీరోగా నటించిన అడవి రాముడు సినిమాలో ఆర్తి అగర్వాల్ ప్రభాస్ కి జోడీగా నటించగా వీరిద్దరూ కలిసి ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాటలు ప్రేక్షకులకు నాటి హిట్ సాంగ్ గుర్తు చేస్తూ మరోసారి అదరగొట్టారు అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత ఏకంగా వర్షం సినిమాలో కూడా మరో టైన్ సాంగ్ తో అదరగొట్టాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ వర్షం సాక్షిగా తెలుపనా నువ్వు నాకే సొంతం... అంటూ ఉన్న రైన్ సాంగ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమాలు సన్నివేశానికి తగ్గట్లుగా వచ్చిన ఈ సాంగ్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది అని చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిష నటించగా.. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంతగానో కుదిరింది.
ప్రభాస్ త్రిషల మధ్య ఉన్న గాఢమైన ప్రేమను తెలిపే విధంగా ఈ వర్షం సాక్షిగా అనే పాట సాగిపోతూ ఉంటుంది. అలా నేటి తరం యువ హీరోల్లో ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో ఏకంగా రెండుసార్లు రైన్ సాంగ్స్ చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇక రెండు సార్లు చేసినప్పటికీ ఈ రైన్ సాంగ్స్ ప్రభాస్ కి బాగా కలిసి వచ్చాయి అని చెప్పాలి. ప్రభాస్ రరైన్ సాంగ్స్ చేసిన ఈ రెండు సినిమాలు భారీ విజయాలను సాధించాయి. కాగా ఈ వర్షం సాక్షిగా అనే పాట మాత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ గానే ఉంది.