ఈ ఇయర్ మొదట్లో సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో సత్తా చాటిన రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో చరణ్ కు జోడీగా నటిస్తుంది. తెలుగులో ఇప్పుడు ఫాంలో ఉన్న స్టార్స్ లో పూజా హెగ్దే తర్వాత స్థానంలో రష్మిక మందన్న ఉంది. ఎలాగు తెలుగులో వరుస ఛాన్సులు వస్తున్నాయని అమ్మడు ఇక్కడికే తన మఖాం మార్చేసింది.
హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియాలో రష్మిక త్రిపుల్ బెడ్ రూం ఫ్లాట్ ఒకటి కొనేసిందని తెలుస్తుంది. ఇక్కడే ఉంటే సినిమా షూటింగ్స్ కు అందుబాటులో ఉంటుందని తెలుతుంది. పుష్ప, ఆచార్య మాత్రమే కాకుండా ఎన్.టి.ఆర్, త్రివిక్రం సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉన్నట్టు టాక్. సినిమాకు కోటిన్నర దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్న అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారింది. రష్మిక సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్ అన్నట్టుగా టాక్ వచ్చింది. అందుకే ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి