ఈ చిత్రంలో అతను చేసిన పాత్ర కు ప్రశంసల జల్లులు వెల్లువెత్తాయి. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు సందీప్. అయితే ఇప్పుడు తాజాగా హ్యాట్రిక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సందీప్ మాధవ్. అయితే ఈ చిత్రం కూడా తన ముందు చిత్రాల లాగే డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అప్సర్ హుస్సేన్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయబోతున్నారు. యస్ అండ్ యమ్ క్రియేషన్స్ మరియు వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకాలపై సుబాని అబ్దుల్ నిర్మించబోతున్నారు. మలయాళ కథానాయికలైన గాయత్రి సురేష్, అక్షిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
యువ సంగీత దర్శకుడు రాప్ రాక్ షకీల్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు ప్రముఖ దర్శకుడు వీరశంకర్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సరికొత్త కథతో రాబోతున్న ఈ చిత్రంలో వైవిధ్యభరిత నటుడు సందీప్ మాధవ్ చేయబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. దీనితో ఈ సినిమా కూడా సందీప్ కు జార్జి రెడ్డి సినిమా లాగా మంచి క్రేజును తీసుకు రావాలని తన అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఏ విధంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోనుందో వేచి చూడాలి మరి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి