కృష్ణవంశీ ఎన్నో అంచనాలతో చాల కష్టపడి తీసిన ‘గోవిందుడు అందరివాడేలే’ అనుకున్నంత విజయాన్ని సాధించాక పోవడంతో మళ్ళీ మరొక ప్రయోగం చేసి తన సత్తా చాటడానికి రకరకాల ఆలోచనలు చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం గోవా వెళ్ళి జూనియర్ కు ‘రాఖి’ సీక్వెల్ కథను వినిపించి బుట్టలో పడేద్దామని ప్రయత్నించినా ఆ పని జరగలేదు. దీనితో రూట్ మార్చి అక్కడే ఉన్న ప్రకాష్ రాజ్ కు మరో కథను వినిపించాడట కృష్ణవంశీ. ప్రస్తుత సామాజిక రాజకీయ విషయాల నేపధ్యంలో వర్తమాన పరిస్తుతులను ప్రతిబింబించే పవర్ ఫుల్ స్టోరీ ఇది అని టాక్. ఈ కథ విన్న వెంటనే ప్రకాష్ రాజ్ మరో ఆలోచన లేకుండా ఈ సినిమాను మనం తీద్దాము అని అనడమే కాకుండా ఈ కథను తనకు సన్నిహితుడైన దిల్ రాజ్ కూడా వినిపించి అతడిని కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిని చేసి కృష్ణవంశీకి లైన్ క్లియర్ చేసాడు అనే వార్తలు వస్తున్నాయి.  దీనితో జూనియర్ బుట్టలో పెడదామనుకుని గోవా వెళ్ళిన కృష్ణవంశీకి యంగ్ టైగర్ పడక పోయినా అనుకోకుండా ఇద్దరు రాజులు బుట్టలో పడ్డారు అంటూ కృష్ణవంశీ పై సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. అంతా కొత్త నటీనటులతో నిర్మించబడే ఈ సినిమా వచ్చే జనవరి నుండి ప్రారంభం అవుతుంది అనే వార్తలు వినపడుతున్నాయి.  ఏది ఎలా ఉన్నా కృష్ణవంశీకి దురదృష్టంలో అదృష్టం కలిసి వచ్చింది అనుకోవాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: