మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా సుకుమార్ అసిస్టెంట్ కార్తిక్ డైరక్షన్ లో వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నాని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మెగా హీరో సాయి ధరం తేజ్ తో సుప్రీం, ప్రతిరోజూ పండుగే సినిమాలతో ఈ ఇద్దరు జోడీ సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారట. అయితే ఈ సినిమా పిరియాడికల్ స్టోరీగా వస్తుందని తెలుస్తుంది.

సస్పెన్స్ థ్రిల్లర్ గా సాయి ధరం తేజ్ కెరియర్ లో మొదటిసారి కొత్త ప్రయత్నంగా ఈ సినిమా వస్తుందని అంటున్నారు. సాయి ధరం తేజ్ ఇన్నాళ్లు కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలతో అలరించాడు. కెరియర్ లో ఫస్ట్ టైం కాన్సెప్ట్ మూవీ చేస్తున్నట్టు చెబుతున్నారు. మెగా ఫ్యాన్స్ తన మీద చూపిస్తున్న ఈ అభిమానాన్ని నిలబెట్టుకునేందుకు సాయి ధరం తేజ్ సినిమా సినిమాకు కష్టపడుతున్నాడు. చిత్రలహరి ముందు వరకు ఓటమితో పోరాటం చేసిన సాయి ధరం తేజ్ ఫైనల్ గా చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలతో ట్రాక్ ఎక్కేశాడు.

కార్తిక్ సినిమాతో పాటుగా దేవా కట్టా డైరక్షన్ లో సాయి ధరం తేజ్ సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిపబ్లిక్ డే నాడు రిలీజ్ ప్లాన్ చేశారు. సాయి ధరం తేజ్ తో దేవా కట్ట మరో ప్రస్థానం సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. అది ఏమిటి అన్నది మరో రెండు రోజుల్లో రివీల్ చేస్తారని తెలుస్తుంది.                                 

మరింత సమాచారం తెలుసుకోండి: