సినిమా పరిశ్రమ అన్నాక నటీ నటులకు మధ్యన సత్సబంధాలు కొనసాగడం మామూలే. అప్పుడప్పుడూ వీరి మధ్యన అల్లరి గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇవి అల్లరి గొడవలని తెలియక వీరివురి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వివాదంగా మారుస్తుంటారు. అసలు కథ తెలిసి మళ్ళీ కామ్ గా అయిపోతూ ఉంటారు. ఇప్పుడే అదే విధంగా ఒక సంఘటన జరిగింది. టాలీవుడ్ కండల హీరో దగ్గుబాటి రానా యువ హీరో నాగశౌర్య సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు నమ్మాలా వద్దా అన్న సందిగ్ధం లో పడ్డారు ఫ్యాన్స్. అయితే అసలేం జరిగిందో చూద్దామా ?
నాగశౌర్య హీరోగా 'లక్ష్య' చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మొన్న జరిగిన షెడ్యూల్ లో బ్రహ్మాజీ పై కొన్ని కామెడీ సన్నివేశాలను చిత్రీకరించారట. ఆ సీన్ లకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియా వేదికగా నాగశౌర్య పంచుకోవడం జరిగింది. ఈ ఫొటోలో నాగశౌర్య మరియు బ్రహ్మాజీ సరదాగా నామాలు పెట్టుకున్న లుక్ లో ఉన్నారు. ఇవి కాస్త నవ్వు తెప్పించేవిగా ఉన్నాయి. ఈ ఫోటోను ఉద్దేశించి నాగశౌర్య బ్రహ్మజీని సపోర్ట్ చేయమని కోరాడు. అది కాస్త వైరల్ గా మారుతోంది.
ఆ ఫోటోను చూసి ఈ రోజు దగ్గుబాటి రానా నాగశౌర్యను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. అయితే ఇది సీరియస్ గా కాదండోయ్... బ్రహ్మాజీ మహా మాయగాడు ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండమని నాగ శౌర్యకు సలహా ఇచ్చాడంతే. అయితే మన వాళ్ళు ఎప్పటిలాగే అదేదో రానా నాగశౌర్యకు వార్నింగ్ ఇచ్చినట్లుగా వైరల్ చేసిపడేస్తున్నారు. రానా మెసేజ్ కు నాగశౌర్య కూడా ఓకే భయ్యా...నువ్వు చెప్పింది నిజమే నేను జాగ్రత్తగా ఉండాల్సిందే అని బదులిచ్చారు. ఇది అసలు జరిగింది. సినీ పరిశ్రమలోని మరి కొందరు ఇదంతా కూడా నాగశౌర్య సినిమాను ప్రమోషన్ చేసుకునే పనిలో భాగంగానే చేసారని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: