నయనతార అటు కోలీవుడ్ , ఇటు టాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న విషయం తెలిసిందే. మలయాళ, కన్నడ భాషల్లోనూ హీరోయిన్ గా క్రేజ్ పెంచుకుంది. అందం అంతకు మించిన అభినయం నయన్ కు సొంతం. ఇండస్ట్రీలో అడుగు పెట్టి 15 యేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వన్నె తరగని అందంతో కవ్విస్తోంది ఈ బ్యూటీ.
ఇక మరో వైపు తమిళ స్టార్ హీరో శింబుకి టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. అతడి తమిళ చిత్రాలు వల్లభ, మన్మధ వంటి చాలా చిత్రాలు ఇక్కడ తెలుగు చిత్రాలతో పోటీపడి మరీ మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం ఈయన తమిళ్ లో ‘వెందు తానింధతు కాదు’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా తెలుగులోనూ డబ్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు ఈ ఇద్దరి గురించి ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, గతంలో వీరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం తెలిసిందే, ఇండస్ట్రీలో ఈమె గురించి మొదటి వచ్చిన లవ్ గాసిప్ శింబు తోనే. అతడితో ప్రేమాయణం వీరిద్దరికీ సంబంధించిన ఓ పర్సనల్ ఫోటో లీక్ అవడం దానిపై మండిపడ్డ నయనతార శింబు ఇదంతా కావాలనే చేశాడని అతడితో బ్రేక్ అప్ చేసుకుంది అన్న వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ప్రభుదేవాతో కూడా ఈమె పెళ్లి పీటల వరకు వెళ్లి ఆగిన విషయం తెలిసిందే. కానీ కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియలేదు..ఆ తరవాత గత రెండేళ్ల నుండి తమిళ దర్శకుడు విగ్నేష్ తో ఈమె ప్రేమాయణం సాగిస్తోందని సహజీవనం చేస్తోందని చాలా వార్తలు వచ్చాయి.

అయితే ఇపుడు నయన్ మళ్ళీ మాజీ ప్రియుడు శింబుతో ఓ సినిమాకి ఒకే చెప్పింది అనే వార్త వినిపిస్తోంది. ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు గానీ నయన్ మళ్ళీ బ్యాకప్ చేసుకుంటుందా ఏంటి అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: