గ్లామర్ బ్యూటీగా కాకున్నా మంచి నటిగా లావణ్య త్రిపాఠి కి ఇండస్ట్రీ వర్గాలలో చాల మంచి పేరుంది. అయితే ఆమెకు అదృష్టం మాత్రం ఏవిధంగాను కలిసి రావడంలేదు. దీనితో టాప్ యంగ్ హీరోలు ఆమెతో నటించడానికి పెద్దగా ఆశక్తి కనపరచడం లేదు. ఈ పరిస్థితులలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.


త్వరలో మహేష్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ప్రారంభం కాబోతున్న క్రేజీ మూవీ ప్రాజెక్ట్ లో లావణ్య త్రిపాఠి కి సెకండ్ హీరోయిన్ అవకాశం వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ కు కూడ చాల ప్రాధాన్యత ఉన్న నేపద్యంలో త్రివిక్రమ్ ఈ పాత్రకు లావణ్య త్రిపాఠి ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్న పరిస్థితులలో ఆమె దశ తిరిగినట్లే అన్న కామెంట్స్ వస్తున్నాయి.


గతంలో కూడ ఇలాగే త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ప్రణిత ను ఎంపిక చేసి ఆమెకు మళ్ళీ క్రేజ్ పెరిగేలా చేసాడు. గత సంవత్సరం విడుదలై బ్లాక్ బష్టర్ హిట్ గా మారిన ‘అల వైకుంఠ పురములో’ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నివేదితా పేతురాయ్ ని ఎంపిక చేసి ఆమెకు కూడ అవకాశాలు వచ్చేలా చేసాడు. ఇప్పుడు ఐరన్ లెగ్ బ్యూటీగా పేరుగాంచిన లావణ్య కు త్రివిక్రమ్ ఇస్తున్న అవకాశం నిజం అయితే తిరిగి ఆమె కెరియర్ గాడిలో పడినట్లే అనుకోవాలి.  


ఇప్పటికే లావణ్య త్రిపాఠి రవితేజా పక్కన ఒక మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. అదేవిధంగా దిల్ రాజ్ ఫ్యామిలీ నుండి వస్తున్న యంగ్ హీరో ఆశిష్ రెడ్డి తో కూడ ఈమె మరొక సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలలో ఏఒక్క సినిమా అయినా సూపర్ హిట్ అయితే ఆమె కెరియర్ తిరిగి ట్రాక్ లో పడినట్లే అనుకోవాలి..  





మరింత సమాచారం తెలుసుకోండి: