ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మొదటిసారి పాన్ ఇండియా మూవీ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో అలరించడానికి సిద్ధమయ్యారు. 1920 నాటి కాలంలో స్వతంత్రం కోసం పోరాడిన ఇద్దరు సమరయోధుల జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించడం గమనార్హం. ఈ సినిమాలో ఎన్టీఆర్ , రాంచరణ్ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీగా నటిస్తూ అందరినీ ఎంతో ఎదురుచూసేలా చేస్తున్నారు. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అలియా భట్ ను మొట్టమొదటిసారి తెలుగు సినిమా కోసం ఈ సినిమాలో నటింపజేయడం గమనార్హం. ఇక దీంతో ఈ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆలియాభట్ తెలుగు సినీ ఇండస్ట్రీ చాలా నచ్చింది అంటూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ గా మారాయి.


ఇక శ్రేయ, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, మాలీవుడ్ సూపర్ స్టార్ హీరో  ఫహాధ్ ఫాజిల్  ఇలా ప్రతి ఒక్కరికి  కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ప్రతి ప్రాంతీయ భాషకు చెందిన నటులు ఈ సినిమాలో నటింపజేయడం గమనార్హం. మొట్టమొదటిసారి పూర్తిస్థాయిలో ఈ సినిమాను భారీ అంచనాల మద్య ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున అన్ని భాషలలో ఈ సినిమాకు ప్రమోషన్ చేస్తూ ఉండడం గమనార్హం. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ముంబైలో పూర్తిస్థాయిలో అతిపెద్ద స్టేజ్  ఏర్పాటు చేసి ప్రమోషన్స్ నిర్వహిస్తుండడం అందరికీ ఆశ్చర్యం గా అనిపిస్తోంది.

ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని రీతిలో ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ముంబైలో ఇంత పెద్ద స్టేజ్ ను ప్రమోషన్స్ కోసం ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి ఏది ఏమైనా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ స్టేజ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం అది కాస్త వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: