పాన్ ఇండియా బిగ్గెస్ట్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ మరో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది. ప్రభాస్ గత సినిమా సాహో అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ కావాలని బాగా కోరుకుంటున్నారు.ఇక మన పాన్ ఇండియా హీరో ప్రభాస్ సైతం ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పునర్జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.చాలా స్టైలిష్ అండ్ క్లాస్ మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్ లో హార్ట్ టచింగ్ సీన్లు చాలా ఎక్కువగానే ఉంటాయని సమాచారం.ప్రభాస్ యాక్టింగ్ అయితే వేరే లెవలట.అయితే ఈ సినిమాలోని ఒక సీన్ లో ప్రభాస్ ఏడవకుండానే ప్రేక్షకులను ఏడిపిస్తారని సమాచారం తెలుస్తుంది.
గతంలో మాస్ సినిమాలు ఎక్కువగా చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రూటు మార్చారు. అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలలో నటించడానికి ప్రభాస్ చాలా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ల విషయంలో కూడా వేగం పెరిగింది. ఈ సినిమా ట్రైలర్ కు తెలుగులో కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.వ్యూస్ పరంగా రాధేశ్యామ్ సినిమా ట్రైలర్ పాత రికార్డులను తుడిచేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఒక సీన్ లో హీరోయిన్ చనిపోతారని ఆ సీన్ లో ప్రభాస్ పర్ఫామెన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉంటుందని సమాచారం తెలుస్తుంది. రాధేశ్యామ్ ఫైనల్ కట్ ను చూసిన ప్రభాస్ చాలా సంతోషంగా ఫీలయ్యారని సమాచారం. బాహుబలి2 తర్వాత ఆ స్థాయి హిట్ రాధేశ్యామ్ తో సాధిస్తానని ప్రభాస్ చాలా నమ్మకంతో ఉన్నారు.ఇక ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటించగా ప్రభాస్ ఇంకా అలాగే పూజా హెగ్డే కాంబోలో వచ్చిన మొదటి మూవీ రాధేశ్యామ్ కావడం గమనార్హం.
గతంలో మాస్ సినిమాలు ఎక్కువగా చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రూటు మార్చారు. అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలలో నటించడానికి ప్రభాస్ చాలా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ల విషయంలో కూడా వేగం పెరిగింది. ఈ సినిమా ట్రైలర్ కు తెలుగులో కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.వ్యూస్ పరంగా రాధేశ్యామ్ సినిమా ట్రైలర్ పాత రికార్డులను తుడిచేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఒక సీన్ లో హీరోయిన్ చనిపోతారని ఆ సీన్ లో ప్రభాస్ పర్ఫామెన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉంటుందని సమాచారం తెలుస్తుంది. రాధేశ్యామ్ ఫైనల్ కట్ ను చూసిన ప్రభాస్ చాలా సంతోషంగా ఫీలయ్యారని సమాచారం. బాహుబలి2 తర్వాత ఆ స్థాయి హిట్ రాధేశ్యామ్ తో సాధిస్తానని ప్రభాస్ చాలా నమ్మకంతో ఉన్నారు.ఇక ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటించగా ప్రభాస్ ఇంకా అలాగే పూజా హెగ్డే కాంబోలో వచ్చిన మొదటి మూవీ రాధేశ్యామ్ కావడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి