నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ మూవీ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. డైరెక్టర్ రాహుల్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఇందులో నాని వాసుదేవ్ పాత్రలో శ్యామ్ సింగరాయ్ పాత్రలో మెప్పించారని చెప్పవచ్చు.ఈ సినిమాని గత ఏడాది డిసెంబర్ 24న అన్ని భాషలలో ఒకేసారి విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమా మంచి సూపర్ హిట్ టాక్ తో ముందుకు కొనసాగింది. కలెక్షన్ల పరంగా కూడా గత సినిమాల కంటే ఈ సినిమాకి కాస్త గట్టిగానే రాబట్టాయి అని చెప్పవచ్చు. ఇక ఇందులో దేవదాసు పాత్రలో సాయి పల్లవి నటనతో మరొకసారి ప్రశంసల వర్షం కురిపించింది.

సినిమా విడుదలై ఇప్పటికి నెలరోజులు కావస్తున్నా కూడా ఏ మాత్రం క్రేజ్ ఎక్కడా తగ్గలేదు.. అయితే నెట్ ఫ్లెక్స్ లో ఈ రోజున విడుదల చేయడం జరిగింది ఈ సినిమాని. ఇక ఈ సినిమా చూసిన వారంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. ఇక తాజాగా ఈ సినిమాను మెగా పవర్ స్టార్ కూడ సినిమాని మెచ్చుకున్నారు. ఇక ఈ సినిమా  సాయి పల్లవి నాని కెరీర్లోనే బెస్ట్ సినిమా అని తెలియజేశారు రామ్ చరణ్. ఇక మిగతా హీరోయిన్ కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ని కూడా అభినందించడం జరిగింది.

ఇప్పుడు తాజాగా చిరంజీవి కూడా ఈ సినిమాను చూసి.. హీరో నాని ని తన ఇంటికి పిలుచుకొని మరి  చిరంజీవి దంపతులు ఇద్దరు ఆయనను అభినందించడం జరిగింది. ప్రస్తుతం అందుకు తగ్గట్టుగా ఒక వీడియో కూడా ట్రెండింగ్ గా మారుతుంది. ఇక దీంతో ఈ సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది ప్రేక్షకులలో. ఇక చిరంజీవి ఆహ్వానం మేరకు మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టాడు నాని. ఇక ఈ సినిమా సంగతులను మాట్లాడుకోవడం ఈ కింద ఉన్న వీడియోలో మనం చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: