టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఓ అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న హీరోలలో ఒకరు ఆయన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి చూపులు మూవీ తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.

ఆ తర్వాత గీత గోవింద మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా , పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ధర్మ ప్రొడక్షన్స్ , పూరి కనెక్ట్స్ బ్యానర్ లలో  కరణ్ జోహార్ మరియు పూరి జగన్నాథ్ కలిసి సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు. ఆగస్ట్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ మూవీ ని విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ సభ్యులు ఫాండోమ్ టూర్ పేరుతో దేశ వ్యాప్తంగా ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా లైగర్ మూవీ యూనిట్ వరంగల్ లో సందడి చేసింది. వరంగల్ టూర్ లో భాగంగా విజయ్ దేవరకొండ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ...  నేను , పూరి జగన్నాథ్ గారు ,  చార్మి గారు ఇండియా ని షేక్ చేద్దాం అని లైగర్ మూవీ ని స్టార్ట్ చేసి ముంబై కి వెళ్ళాం.  సూర్ గా అదే చేయబోతున్నాం అంటూ తాజాగా విజయ్ దేవరకొండ చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: