విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మట్టి కుస్తీ.. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా చెల్లా అయ్యావు దర్శకత్వంలో రవితేజ టీం వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ కథానాయకుడు రవితేజతో.. కలిసి విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా మట్టికుస్తీ.. లేటెస్ట్ స్పోర్ట్స్ బేస్డ్ యాక్షన్ డ్రామా తమిళ మూవీ గట్టా కుస్తీ సినిమా తెలుగులో మట్టి కుస్తీ పేరుతో రిలీజ్ కానున్న ఈ సినిమాపై తెలుగు , తమిళ భాషల ఆడియన్స్ లో మంచి అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీకి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు.

నవంబర్ 20వ తేదీన ఈ మూవీ యొక్క తమిళ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను చెన్నైలో చాలా వైభవంగా పూర్తి చేశారు. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ తో పాటు సినీ ప్రముఖులు ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు.  ముఖ్యంగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ లుక్స్ అందర్నీ బాగా ఆకట్టుకున్నాయి. పోతే తెలుగు వర్షన్ అయిన మట్టి కుస్తీ ట్రైలర్ ను 21వ తేదీ రాత్రి 8 గంటలకు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీని ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకుడు చెల్లా అయ్యావు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని.. ట్రైలర్ చూస్తే మనకు స్పష్టం అవుతుంది.
ఇకపోతే డిసెంబర్ 2 తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్న నేపథ్యంలో మట్టి కుస్తీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నవంబర్ 27న ఆదివారం హైదరాబాదులో జే ఆర్ సీ లో ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా రవితేజ తో పాటు మరికొంతమంది సీనియర్ ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం . మరి విష్ణు విశాల్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా విజయమైతే నిర్మాతగా రవితేజ కూడా సక్సెస్ అయినట్టే..

మరింత సమాచారం తెలుసుకోండి: