
నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో మొదలుపెట్టి వరుసగా సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇస్తున్నారు. అఖండ - వీర సింహారెడ్డి - భగవంత్ కేసరి తాజాగా ఈ సంక్రాంతికి డాకు మహారాజు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్యకు వరుసగా నాలుగో హిట్ సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ కు అరుదైన గౌరవం దక్కింది. సితార ఎంటర్టైన్మెంట్స్ - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ .. దర్శకుడు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్యలు భారీ బడ్జెట్తో డాకు మహారాజ్ సినిమా ను నిర్మించారు. ఇందులో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా , శ్రద్ధా శ్రీనాథ్ , చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. ఎస్ ఎస్ . థమన్ స్వరాలు సమకూర్చారు. టీజర్ , ట్రైలర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక బాలయ్య కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది డాకు మహారాజ్. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. బాలకృష్ణ నట విశ్వరూపానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఫిదా అవుతారు. అయితే ఎప్పుడు ఉద్రిక్తంగా ఉండే ఇరాక్ సైతం ఫిదా అయింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ వార్తాపత్రిక డాకు మహారాజ్ సినిమా అందులో హీరో పాత్ర గురించి ప్రస్తావిస్తూ ఓ రివ్యూ ప్రచురించింది. హీరో ను చాలా పవర్ఫుల్గా చూపించారని ... సినిమాలో టెక్నికల్ వాల్యూస్ , యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయని ఆ కథనంలో పేర్కొంది. దీనికి సంబంధించిన పేపర్ కటింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక తెలుగు సినిమా గురించి ఎక్కడో ఇరాక్ దేశంలో పేపర్ లో రావటం తమ హీరో చాలా గ్రేట్ అని బాలయ్య అభిమానులు అవుతున్నారు.