ఇక నిన్న టాలీవుడ్ బాక్సాఫీస్ ముందుకు బైరవం మూవీ రిలీజ్ అయింది .. ఖలేజా రీరిలీజ్ కారణంగా ఓపెనింగ్స్ కొంత ప్రభావం చూపించినప్పటికీ .. టాక్  పాజిటివ్ గా రావటంతో వీకెండ్ కంతా  వసూళ్లు  పెరుగుతాయని నమ్మకంతో టీం ఉంది .. అలాగే ఇది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కం బ్యాక్ అయినా అదిక శాతం ప్రేక్షకులకు దీని మీద ఆసక్తి కలవడానికి కారణం మంచు మనోజ్ .. తను ఫుల్ లెన్త్ రోల్ లో చివరిసారి కనిపించింది 2017 లో వచ్చిన ఒక్కడు మిగిలాడు .. ఆ తర్వాత సినిమాల నుంచి పక్కకు వెళ్ళిపోయాడు .. ఆ తర్వాత మధ్యలో రెండు క్యామియోలు చేసిన జనాలకు నచ్చలేదు .. ఇలా మొత్తంగా 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇప్పుడు భైరవం ద్వారా రియంట్రీ ఇచ్చాడు .


నెగిటివ్ టచ్ ఉన్న గజపతి క్యారెక్టర్ లో మంచు మనోజ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేసాడు .. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు గొంతును మరీ గంభీరంగా పెట్టి అర్చినట్టు అనిపించిన మొత్తంగా చూసుకుంటే తన క్యారెక్టర్ వరకు బెస్ట్ ఇవ్వడానికి బాగా ప్రయత్నించాడు .. ముఖ్యంగా నారా రోహిత్ తో తన కాంబినేషన్ సీన్లు బాగా వచ్చాయి .. ఇక నెక్స్ట్ మిరాయ్ లో కూడా మనోజ్ విలన్ గానే కనిపించబోతున్న విషయం తెలిసింది .. రీసెంట్గా వచ్చిన టీజర్ లో కూడా అదే క్లారిటీ వచ్చేసింది .. ఈ రెండు కనక బాగా క్లిక్ అయితే మనోజ్ రూపంలో టాలీవుడ్ కు కొత్త విలన్ దొరికినట్టు అవుతుంది అయితే హీరో గాను తనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఉండటం ఇక్కడ గమనించాల్సిన మరో ఇంట్రెస్టింగ్ విషయం .



తన ఫ్యామిలీ వివాదాలతో తరచూ నలుగుతున్న మనోజ్ ఈ మధ్య మంచి ఫామ్ లో ఉన్నాడు .. అలాగే భైరవం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అందరితో ఎంతో సరదాగా ఉంటూ జోకులు పేలుస్తూ వాటిని బాగా హైలెట్ చేశారు .. మరోపక్క నారా రోహిత్ , సాయి శ్రీనివాస్ ఎంత మాట్లాడినా వాళ్ళను డామినేట్ చేసేలా తన కామెడీ టైమింగ్ తో బాగా అదరగొట్టాడు .  అయితే మనోజ్ ని కేవలం సీరియస్ పాత్రులకు పరిమితం చేయకుండా అతనిలో ఉన్న కామెడీ టైమింగ్ ని కూడా వాడుకుంటే బిందాస్, దొంగ దొంగది , పోటుగాడు లాంటి మంచి కామెడీ పండించే సినిమాలు కూడా వస్తాయి .. మనోజ్ మాత్రం ఇదే ఫ్లోతో  వేగంగా సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు .. ఇక మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏం చేస్తాడు ..

మరింత సమాచారం తెలుసుకోండి: