తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం తాను జైలుకైనా కోర్టుకైనా వెళ్ళడానికి రెడీ అంటూ పవన్ కళ్యాణ్ తన ట్విటర్ లో మరో బుల్లెట్ వదిలాడు. తనపై టీడీపీ ఎంపీలు చేసిన విమర్శలపై జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఈ విధంగా స్పందించాడు.  తాను జైలుకైనా, కోర్టుకైనా వెళ్ళడానికి సిద్ధమేనని అంటూ తగిన ఏర్పాట్లు త్వరగా చేస్తే మంచిదని తన ట్విట్టర్‌లో సంచలనాత్మకంగా ట్విట్ చేసాడు. 

నిన్న సాయంత్రం నుండి తన పై విరుచుకుపడుతున్న పార్లమెంట్ మెంబర్ల వ్యాఖ్యలకు కౌంటర్ గా పవన్ ఈ మాటల దాడి మొదలు పెట్టాడు. అవసరమైతే పవన్‌పై కోర్టులో కేసు పెడతామని ఎంపీ కేశినేని నాని చేసిన సవాల్ కు ప్రతి సవాల్ గా పవన్ తన ట్విటర్ లో ఈ వ్యాఖ్యలు చేసాడు. 

ఈవార్తలు ఇలా ఉండగా ‘జనసేన’ కార్యకర్తలు పవన్ కు మద్దతుగా రంగంలోకి దిగారు. పవన్ ప్రచారం చేయకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేదా అంటూ వారు ఈరోజు విజయవాడ కాళేశ్వర మార్కెట్ సెంటర్‌లో నిరసనకు దిగారు. అంతేకాదు రాష్ర్టానికి ప్రత్యేకహోదా తీసుకురావాలని ‘జనసేన’ కార్యకర్తలు ఎంపీలను సవాల్ చేయడమే కాకుండా దమ్ముంటే రాబోతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఇందుకు పోరాడాలని, మిమ్మల్ని గెలిపించిన నేతకు ప్రశ్నించే హక్కు లేదా అంటూ పవన్ కు బాసటగా ‘జనసేన’ కార్యకర్తలు రంగంలోకి దిగారు. 

ఈ పరిస్థుతులు చూస్తూ ఉంటే ఈ మాటలయుద్ధం మరింత ముదిరి పవన్ చంద్రబాబుల మధ్య వార్ గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: