వైఎస్సార్ బావమరిది , వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మేనమామ కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి తో న్యాయపోరాటంలో గెలిచిన నీరజారావుకు తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఇవ్వనుందా? ఆమెను వైఎస్సార్ కాంగ్రెస్ పై అస్త్రంలా సంధించనుందా? ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం నీరజారావుకు టికెట్ ఇవ్వడానికి తెలుగుదేశం ఉత్సాహం చూపిస్తోందని తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ లోని స్థలానికి సంబంధించి న్యాయ పోరాటంలో గెలిచిన ఆమెకు అండగా ఉంటామని తెలుగుదేశం వాళ్లు ప్రకటించారు. నీరజ న్యాయపోరాటాన్ని కూడా తెలుగుదేశం అనుకూల మీడియా హైలెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీరజారావుకు తెలుగుదేశం టికెట్ ఇవ్వడం పెద్ద విషయం కాదని చెప్పాలి. వైఎస్ ఫ్యామిలీ చేసిన అక్రమాలపై ఆమె విజయం సాధించిందని, ఆ స్ఫూర్తిని నింపడానికి తాము ఆమెకు టికెట్ ఇస్తామని తెలుగుదేశం వాళ్లు సమర్థించుకొనే అవకాశం ఉంది. ఆమెను ఒక హీరోగా చూపి లబ్ధి పొందే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జూబ్లీ హిల్స్ లోని ఇంటిని కూడా సందర్శించాడు. అక్కడ నుంచి వైఎస్ ఫ్యామిలీపై ధ్వజమెత్తాడు. దీంతో నీరజారావుకు తెలుగుదేశం టికెట్ అనే వార్తకు మరింత విలువస్తోంది. కోర్టులో ఇన్ని రోజుల పాటు పోరాడిన ఆమె నైజాన్ని చూసి ఆమెకు కూడా బాగానే బ్యాక్ గ్రౌండ్ ఉందని అనుకోవాల్సి వస్తోంది. దీంతో నీరజారావు మీద అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే నీరజారావు తెలుగుదేశం వాళ్లకు బాగా ఉపయోగపడింది. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే మరింత ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. వైఎస్సార్ ఫ్యామిలీని టార్గెట్ చేసుకోవడానికి, నిత్యం విమర్శలు చేయడానికి నీరజ ఉపయుక్తంగా ఉంటుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: