ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల పేరుతో జరుగుతున్న నేరాలూ ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. ఇద్దరు వ్యక్తుల మధ్యలోకి  మూడో వ్యక్తి ప్రవేశించడంతో అసలు సమస్య మొదలై అది ప్రాణాలు తీసుకునే వరకు వెళుతుంది. ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలకు సంబంధించిన హత్యలు ఎన్నో తెరమీదికి వస్తూ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఎంతోమంది ప్రాణాలను తీసేస్తున్నారు... చివరికి జైలు పాలై కటకటాల వెనుకకు వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు చాలానే పునరావృతం అవుతూనే ఉన్నాయి. ప్రాణాలు తీస్తే శిక్ష పడుతుంది అన్న భయం ఎవరి లో కనిపించడం లేదు. తాజాగా ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.


 నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో... మాజీ ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన అందరిని ఒక్కసారిగా ఉలిక్కి పాటు కు గురిచేసింది. మహారాష్ట్రలోని పూణే నగరంలో జరిగింది ఈ దారుణ ఘటన. పూణే శివారులోని షిరూర్ గ్రామానికి చెందిన సారిక  అనే మహిళతో.. దత్తాత్రేయ  గైక్వాడ్ అనే వ్యక్తి నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే ఇద్దరికీ వివాహాలు అయినప్పటికీ జీవిత భాగస్వాములను వదిలేసి ఇద్దరు కలిసి ఉంటున్నారు. తర్వాత ఏమైందో కానీ వీరిద్దరి మధ్య గొడవలు కావడం మొదలైంది. ఇక సారిక ప్రవర్తనపై దత్తాత్రేయ అనుమానించడం మొదలు పెట్టాడు.


తన కళ్ళు కప్పి తన ప్రియురాలు ఇతరులతో అక్రమ సంబంధాలకు తెర లేపుతోంది అంటూ అనుమానించడం మొదలు పెట్టాడు దత్తాత్రేయ. ఈ అనుమానంతోనే తరచూ గొడవలు పడుతూ సూటిపోటి మాటలతో దూషించేవాడు. ఈ క్రమంలోనే  బుధవారం రాత్రి ఆమెతో మరోసారి గొడవపడి క్షణికావేశంలో ఏకంగా  కత్తితో గొంతుకోసి ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: