నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో... మాజీ ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన అందరిని ఒక్కసారిగా ఉలిక్కి పాటు కు గురిచేసింది. మహారాష్ట్రలోని పూణే నగరంలో జరిగింది ఈ దారుణ ఘటన. పూణే శివారులోని షిరూర్ గ్రామానికి చెందిన సారిక అనే మహిళతో.. దత్తాత్రేయ గైక్వాడ్ అనే వ్యక్తి నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే ఇద్దరికీ వివాహాలు అయినప్పటికీ జీవిత భాగస్వాములను వదిలేసి ఇద్దరు కలిసి ఉంటున్నారు. తర్వాత ఏమైందో కానీ వీరిద్దరి మధ్య గొడవలు కావడం మొదలైంది. ఇక సారిక ప్రవర్తనపై దత్తాత్రేయ అనుమానించడం మొదలు పెట్టాడు.
తన కళ్ళు కప్పి తన ప్రియురాలు ఇతరులతో అక్రమ సంబంధాలకు తెర లేపుతోంది అంటూ అనుమానించడం మొదలు పెట్టాడు దత్తాత్రేయ. ఈ అనుమానంతోనే తరచూ గొడవలు పడుతూ సూటిపోటి మాటలతో దూషించేవాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఆమెతో మరోసారి గొడవపడి క్షణికావేశంలో ఏకంగా కత్తితో గొంతుకోసి ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.
Powered by Froala Editor